Drink Water : నీరు మనిషికి ప్రాణాధారం. అందుకే నీళ్లు తాగనిదే ఏ జీవి ఉండలేదు. ప్రతి ప్రాణమున్న జీవి నీరు తాగనిదే బతకదు. దీంతో మంచినీరు ప్రాధాన్యత తెలుసుకుని నిత్యం నీళ్లు తాగుతుండాలి. దీని వల్ల మన శారీరక వ్యవస్థ మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే నీరు తప్పనిసరి. రోజుకు తగిన పరిమాణంలో నీళ్ల తాగకపోతే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.
నీళ్లు ఎప్పుడు తాగాలనే దానిపై కూడా అవగాహన ఉండాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓ గ్లాసు నీరు అందులో నిమ్మరసం కలుపుని తాగడం వల్ల విటమిన్ సి, పొటాషియం అందుతుంది. కొందరికి అన్నం తినే సమయంలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇది కరెక్టు కాదు తిన్న తరువాత గంటన్నర వరకు నీళ్లు తాగకూడదు. నీళ్లు తాగడం వల్ల మనకు ఇబ్బందులు వస్తాయి.
కొందరికి దొంగ ఆకలి వేస్తుంది. అన్నం తిన్న వెంటనే మళ్లీ అన్నం తినాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది దొంగ ఆకలి. కడుపు నిండా తిన్నాక మళ్లీ ఆకలి వేస్తే నీళ్లు తాగాలి. అప్పుడు మళ్లీ ఆకలి వేయకపోతే అది దాహం అని తెలుసుకోవాలి. భోజనం చేయడానికి అర గంట ముందు తాగాలి. దీంతో ఆకలి బాగా వేస్తుంది. తినేటప్పుడు తాగొద్దు. తరువాత గంటన్నరకు మళ్లీ నీళ్లు తాగితే మంచిది.
మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు లోపల యాసిడ్ విడుదల అవుతుంది. ఆ యాసిడ్ తో నీళ్లు కలిస్తే జీర్ణ ప్ర్రక్రియ ఆలస్యం అవుతుంది. అందుకే తినేసమయంలో నీళ్లు తాగడం సురక్షితం కాదు. తిన్న తరువాత గంటన్నర నుంచి ప్రతి అర గంటకో గ్లాసు నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. ఇలా నీళ్లు తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి.