ఈ రోజుల్లో చాలా మంది రాగి, కుండల్లో నీళ్లు తాగుతున్నారు. ఈ రెండింటి వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కానీ ఇందులో ఏది మంచిది అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. వీటిల్లో పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం నీళ్లు తాగే క్రమంలో వీటిని ఆశ్రయించడం సహజమే. ఎండాకాలంలో కుండలో నీళ్లు తాగుతాం. మిగతా కాలాల్లో రాగి పాత్రలను ఉపయోగిస్తాం. దీంతో మన ఆరోగ్యం బాగుండాలని తాపత్రయ పడతాం.
వేసవిలో మట్టి కుండలోనే ఎందుకు నీళ్లు తాగాలి. ఎండాకాలంలో మట్టి కుండ చల్లగా ఉంటుంది. దీంతో మన శరీరం డీ హైడ్రేడ్ కాకుండా కాపాడుతుంది. మట్టి కుండ శీతలీకరణ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇందులో అల్కలీన్ స్వభావం ఉండటం వల్ల మన శరీరానికి ఎంతో మంచిది. ప్రతి రోజు మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.
రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ను దూరం చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదపడుతుంది. ఇందులో ఇనుము ఉండటం వల్ల రక్తహీనత దూరం అవుతుంది. రాగి సీసాలో నీళ్లు తాగితే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. గుండెకు మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను విచ్ఛిన్నం చేస్తుంది.
శరీరాన్ని చల్లగా ఉంచుతూ మన ఆరోగ్యం బాగు పడేలా చేస్తుంది. వేసవి కాలంలో మట్టి కుండలో నీళ్లు తాగితే మంచిది. చలి, వర్షా కాలాల్లో రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈనేపథ్యంలో మనం నీళ్లు తాగే విషయంలో ఈ రెండు పాత్రలను వాడుకోవడం మంచిదే. దీని వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో నీళ్లు తాగుతూ ఉంటే మనకు కలిగే లాభాలెన్నో.