Sai Kumar : ఇండస్ట్రీలో నటుడిగా రాణించాలంటే కావాల్సిన అతి ముఖ్యమైనది గొంతు.. ఇది వినడానికి ఫన్నీగా ఉన్నప్పటికీ ఇదే నిజం.. వాయిస్ లో బేస్ ఉండి ఏదైనా డైలాగ్ చెబితే ఫ్యాన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేస్తారు.. మరి ఒక్కొక్కరికి ఎంత మంచి నటుడైన గొంతు బాగుండదు.. దీంతో వారు డబ్బింగ్ ఆర్టిస్టులను ఆశ్రయిస్తుంటారు. ముఖ్యంగా ఇప్పటి హీరోలు పక్క భాషల్లో డబ్బింగ్ చెప్పలేక డబ్బింగ్ చెప్పించు కుంటారు..
మన ఇండస్ట్రీలో తమిళ్ నటులు సూర్య, విక్రమ్, సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి హీరోలు డబ్బింగ్ తోనే ఇప్పటికి నెట్టుకొస్తున్నారు. రజినీకాంత్ కు ఎన్నో ఏళ్లుగా మను డబ్బింగ్ చెబుతున్నారు.. ఇలా ఒక్కో హీరోకు ఒక్కొక్కరి వాయిస్ సెట్ అవుతుంది. మరి మన తెలుగులో ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ కూడా డబ్బింగ్ చెప్పించు కుంటారు అనే విషయం తెలిసిందే.
మరి ఈ హీరో అన్నిటిలో పెర్ఫెక్ట్ గా ఉంటారు.. మంచి ఫిజిక్, మ్యాన్లీ లుక్, గాంభీర్యం ఉంటుంది కానీ వాయిస్ మాత్రం చాలా పూర్ అనే చెప్పాలి. అందుకే రాజశేఖర్ కు సాయి కుమార్ గొంతు అందిస్తారు.. ఇది చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అయితే ఒకానొక సమయంలో రాజశేఖర్ సాయి కుమార్ కు డబ్బింగ్ ఆపేసారట.. వీరిద్దరి మధ్య వచ్చిన గొడవ కారణంగా ఈయన డబ్బింగ్ చెప్పానంటే చెప్పను అని పట్టుదలతో ఉన్నాడట.
ఈ క్రమంలోనే రాజశేఖర్ Sai Kumar కు వార్ణింగ్ కూడా ఇచ్చారని.. నాకు డబ్బింగ్ చెప్పకపోతే ఇండస్ట్రీలో నువ్వు ఎలా కొనసాగుతావో చూస్తా అంటూ చెప్పిన కూడా సాయి కుమార్ జంకకుండా తన మాట మీదనే ఉన్నారట. అయితే ఆ తర్వాత సాయి కుమార్ తల్లి తన డైరీలో రాజశేఖర్ ను ఎంతగా ఇష్టపడుతుందో రాసుకున్నది చూసాక తన ఇగో పక్కన పెట్టి రాజశేఖర్ కు డబ్బింగ్ చెప్పడం మళ్ళీ స్టార్ట్ చేసినట్టు టాక్..