
Dr. Jai : అమెరికాలో ఉంటున్న ప్రముఖ ప్రవాసాంధ్రులు, యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీశ్ బాబు యలమంచిలి గారు వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత పనులపై భారత్ కు వచ్చిన ఆయన తెలుగు రాష్ట్రాల్లో పలువురిని కలుస్తూ యూబ్లడ్ యాప్ ద్వారా ఆయన చేస్తున్న కృషిని వివరిస్తున్నారు. అలాగే తాను ఎంతగానో అరాధించే టీడీపీ అధినేత, అభివృద్ధి ప్రదాత, శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కు నాలుగో సారి ముఖ్యమంత్రి కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ..ఈ శుభసందర్భంలో డా. జైగారు ఆంధ్రాలో పర్యటిస్తున్నారు.
రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని..అలాంటి వారిని ఆదుకునేందుకు..వారికి తనవంతుగా ఏదో ఒక సాయం చేయాలనే తపనతో డాక్టర్ జై జగదీశ్ బాబు యలమంచిలి గారు బృహత్తర కార్యక్రమానికి పూనుకున్న సంగతి తెలిసిందే. ఆపద సమయంలో ఆదుకునేందుకు యూబ్లడ్ యాప్ ను తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఐదు రోజుల కిందట హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్ జై గారి సేవా గుణాన్ని ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ ఎంతగానో పొగిడిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో మొన్న ఆయన డాక్టర్ జగదీశ్ బాబు గారు ఆంధ్రాలో తాను పుట్టిన గడ్డపై అడుగుపెట్టి.. నేల తల్లికి మొక్కుకుని, ఆ మట్టిని బొట్టుగా పెట్టుకున్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించిన కూటమి.. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మాతృగడ్డపై అడుగుపెట్టానని డాక్టర్ జై చెప్పారు.
కాగా, చతుర్థి మంగళవారం వారాహి నవరాత్రులు సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని డాక్టర్ జై, జగదీశ్ బాబు యలమంచిలి గారు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జై మాట్లాడుతూ.. అమ్మవారి కరుణకటాక్షాలతో శ్రీ చంద్రబాబు గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రపథాన నిలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మవారి దీవెనలతో సీఎం చంద్రబాబు గారు పోలవరం పూర్తి చేయడమే కాకుండా, అమరావతిని దేశంలో గొప్ప రాజధానిగా తీర్చిదిద్దుతారని ఆయన ఆకాంక్షించారు.