
BRS MLA Mahipal Reddy : బీఆర్ఎస్ కు చెందిన పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేసింది. అతడి సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గురువారం తెల్లవారు జామున ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆయన సోదరుు గూడెం మధుసూదన్ రడ్డి ఇంట్లో కూడా ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గూడెం మహిపాల్ రెడ్డి సోదరులు ఇద్దరు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఓ కేసులో మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధు అరెస్టు కాగా ప్రస్తుతం ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.
తెలంగాణలో ఈడీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఎన్నికలకు ముందు ఐటీ, ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కి విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఈడీ సోదాలు జరుగుతుండడం ఆసక్తి రేపుతోంది.