
AP Elections : ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. నెలన్నర వ్యవధిలో మరోసారి వేడి రాజుకోబోతోంది. దీనికి సంబంధించి షెడ్యూల్ను ఈసీ కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేసింది. మొన్నట్లాగే ఇప్పుడు కూడా అధికార తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
ఏపీలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీని కోసం జూన్ 25వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. జులై 2వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 3వ తేదీ స్క్రూటినీ ఉంటుంది. దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు 5వ తేదీ వరకు గడువు ఉంటుంది. 12న పోలింగ్ నిర్వహించనుంది. అదే రోజున సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, ఇక్బాల్పై అనర్హత వేటు వేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.
ఎన్నికలకు కొద్ది రోజుల ముందే రామచంద్రయ్య టీడీపీలో చేరారు. పార్టీ ఫిరాయించిన ఆయనపై వేటు వేయాలంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది. దీనికి అనుగుణంగా శాసన మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు.. రామచంద్రయ్యపై అనర్హత వేటు వేశారు. వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ ఇక్బాల్పైనా వేటు పడింది.
ఫలితంగా- ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు ఎన్నిక అవసరమైంది. ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడం వల్ల టీడీపీ- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి ఈ రెండింటినీ గెలుచుకోవడం ఖాయమైంది. ఎమ్మెల్సీని గెలిపించుకునేంత బలం లేకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ పోటీ నుంచి తప్పుకోవచ్చు. ఈ రెండు కూడా ఏకగ్రీవం అయ్యేలా కనిపిస్తోంది.