
ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఎలక్ట్రిక్ బైక్ లు ఇన్నాళ్లు పేలిపోవడం చూసాం …… ఇక ఇప్పుడు కార్ల వంతు వచ్చింది. పెట్రోల్, డీజిల్ చార్జీలను భరించలేక సతమతం అవుతున్న వాళ్లకు ఆశాదీపంలా కనిపించాయి ఎలక్ట్రిక్ కార్లు. ఛార్జింగ్ పెట్టేస్తే నామమాత్రపు చార్జీలతో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం సాగించవచ్చు అని ఆశపడిన వాళ్లకు గట్టి షాక్ నే ఇస్తున్నాయి ఎలక్ట్రిక్ కార్లు.
ఇటీవల కాలంలో కార్లకు ఛార్జింగ్ పెడుతున్న సమయంలో అవి పేలిపోవడం , పక్కనే ఉన్న మనుషులకు తీవ్ర గాయాలు కావడం లాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఈ వీడియోనే చూడండి. కార్లకు ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఒక్కసారిగా పేలింది. దాంతో ఆ కారు ముక్కలు ముక్కలైంది. ఆ కార్ల లోని ఓ శకలం వేగంగా దూసుకొచ్చి ఓ గోడను బలంగా ఢీకొట్టి అంతే వేగంగా రివర్స్ లో వచ్చింది.
ఇక ఛార్జింగ్ పెడుతున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దాంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పెట్రోల్ , డీజిల్ రేట్లు పెరుగుతున్నాయని , ఎలక్ట్రిక్ కార్ల వైపు వెళితే ఇంతటి దారుణాలు జరుగుతుండటంతో కార్ల యజమానులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు.






