Anasuya Vs Vijay Fans : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండపై Anasuya పోరాటం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.. ఈమె ఏ మాత్రం తగ్గడం లేదు కదా మరింతగా ఈ వివాదాన్ని పెంచుకుంటూ పోతుంది.. ఈ విషయంలో ఇప్పటికే ఎన్ని విమర్శలు వచ్చిన కూడా తగ్గేదేలే అంటూ ముందుకు వెళుతుంది..
తాజాగా ఈ వివాదంపై మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేసింది అనసూయ.. ఇంస్టాగ్రామ్ లో ఈ అమ్మడు చేసిన లేటెస్ట్ కామెంట్స్ మరోసారి వైరల్ అయ్యాయి.. ”నువ్వు చేసే తప్పు తెలుసుకునే వరకు ఇలా చేస్తూనే ఉంటాను.. దీని వల్ల నేను ఎంత వ్యతిరేకత ఎదుర్కున్నా తగ్గాను.. ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుని సింపతీ పొందడానికి నేను ఏ తప్పు చేయలేదు..నేను క్రిమినల్ కాదు.. నా మీద మీరు ఎంతగా బురద చల్లినా నేను మాత్రం నాకు న్యాయం, ధర్మం మీద నమ్మకం ఉన్నంత వరకు పోరాటం చేస్తూనే ఉంటా” అంటూ చెప్పుకొచ్చింది..
మరి ఈ వివాదంలో ఎవరు తప్పు.. ఎవరు ఒప్పు అని తెలుసుకునే రోజు వస్తుంది ఆ నమ్మకం నాకు ఉంది.. ఎస్ నేను అటెన్షన్ కోరుకుంటున్నాను.. కానీ మీరు అనుకుంటున్నట్లు కాదు.. నా వర్క్, టాలెంట్ నాకు అటెన్షన్ తెచ్చిపెడతాయి తప్ప ఇలాంటి వివాదాలు కాదు.. నాలోని అమ్మను టార్గెట్ చేసారు.. మీకు ఆమె తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తాను.. అంటూ ఈమె ఇచ్చిన స్ట్రాంగ్ వార్ణింగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది..
మరి ఈ వివాదం ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటుందో చూడాలి.. ప్రజెంట్ ఈ అమ్మడు యాంకరింగ్ చెయ్యడం లేదు.. సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది.. వీటితో పాటు ఇలాంటి వివాదాలతో కూడా వైరల్ అవుతుంది.