
Team India : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో గెలిచి ఇండియా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. సెమీఫైనల్ లో భారత్, ఇంగ్లాండ్ తో తలపడనుంది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా చివరి వరకు పోరాడింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఆసీస్ కు ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సులతో విరుచుకుపడ్డాడు. మిచెల్ స్టార్క్ వేసిన రెండో ఓవర్ లోనే మూడు సిక్సులు ఒక ఫోర్ సాయంతో 29 పరుగులు రాబట్టాడు. దీంతో మరోసారి వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ ఆడిన ఇన్సింగ్స్ గుర్తుకుతెచ్చాడు. రోహిత్ శర్మ దూకుడుకు ఏడు ఓవర్లలోనే భారత్ 92 పరుగులకు చేరుకుంది. ఇండియా 205 పరుగులు చేసి ఇన్సింగ్స్ ముగించగా.. ఆసీస్ 181 పరుగులు చేసింది.
ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఇండియా బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ముఖ్యంగా హర్దిక్ పాండ్యాను టార్గెట్ చేసుకుని హిట్టింగ్ చేశాడు. 43 బంతుల్లోనే 76 పరుగులు చేసి చివరకు బుమ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు.
టీ 20 వరల్డ్ కప్ లో టీం ఇండియా సెమీస్ కు చేరుకోవడంతోో ఇక టైటిల్ రేసుకు రెండు అడుగుల దూరంలో ఉంది. సెమీస్ లో డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ ల మధ్య జరిగే మరో సెమీ ఫైనల్ లో ఎవరూ గెలిస్తే వారు ఫైనల్ లో తలపడతారు.
సెమీస్ చేరిన భారత్ కు ఈ సారి ప్రపంచకప్ గెలిచి కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు విరాట్ కొహ్లి, రోహిత్ శర్మలకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ సారి ఎలాగైన కప్పు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ లు తడబడి నిలబడి గెలిచి వచ్చాయి. కానీ భారత్ ఒక్కటే అన్ని మ్యాచుల్లో డామినేట్ ఫర్ఫామెన్స్ తో అదిరిపోయే ఆటతో ప్రత్యర్థి జట్లను చిత్తు చేసి సెమీస్ చేరింది. మరి సెమీస్ లో ఇంగ్లండ్ ను ఓడిస్తే కప్ కు ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంటుంది.