
Ex CM Jagan Trolls : వై నాట్ 175 నుంచి ఒన్లీ 11కు పడిపోయిన వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ తనకు వచ్చిన సీట్లను చూసి ఆశ్చర్యపోయారు. ఆవేదనతో కూడిన స్పీచ్ ఇస్తూ తన తప్పుకాదని దేవుడిపై, ప్రజలపై నిందలు వేశాడు. ఇన్ని పథకాలు తెచ్చినా ప్రజలు ఎందుకు ఆదరించలేదని ఆరోపణలు చేశాడు. కానీ ఐదేళ్లు అధికారం ఇస్తే ఎలా పాలించాలో మాత్రం నేర్చుకోలేకపోయాడు. నవరత్నాలు తెచ్చి నవరంధ్రాల్లో వణుకు పుట్టించాడు. మూడు రాజధానులు అని చెప్పి ప్రజలను ముచ్చెమటలు పట్టించాడు. వీటితో పాటు జగనన్నా అదీ.. జగనన్నా ఇదీ.. అంటూ ఏవేవో తెచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడంతో పాటు ప్రజల ఉసురుపోసుకున్నారు.
రాజధాని లేకుండా విడిపోయిన రాష్ట్రం అప్పులు, ఖర్చులతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రం అని భావించిన ఏపీ ప్రజలు మొదటి టర్మ్ లో చంద్రబాబును గెలిపించారు. ఆయన కూడా చాతనైనంత వరకు అమరావతిని తెచ్చి ఇన్ఫ్రాస్టక్చర్ పెంచేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత జగన్ ఒక్క ఛాన్స్ అనడంతో మరింత అభివృద్ధి చూస్తామనుకున్న జనం ఆయనను కుర్చీ ఎక్కించారు. కుర్చీ ఎక్కినప్పటి నుంచి జగన్ పాలన తుగ్లన్ ను తలపించిందని ఏపీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాంతాలు అభివృద్ధి చేస్తుంటే ఆనందమే.. కానీ ఒక రాజధాని, రెండు రాజధానులు, మూడు రాజధానులు ఏంటి. ఎక్కడైనా ఈ సంప్రదాయం ఉందా? అంటూ మండిపడ్డారు. ఇవన్నీ చూసి ప్రజలు విసుగు చెంది గద్దె దించారు.
ఆయన గద్దె దిగినప్పటి నుంచి జగన్ పై విపరీతమైన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఆడుకుంటున్నారు వైరల్ రాయుళ్లు. వీటికి చూస్తే నవ్వాపుకోవడం ప్రజల వల్ల కావడం లేదు. రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఫొటో పోస్ట్ చేసి ఓడిపోయిన నేను కళ్లు మూసుకున్నా.. ఐదేళ్లు లేపద్దంటూ రాసి మరీ షేర్ చేశారు. ఇది చూసిన వారు నవ్వుకుంటున్నారు.