
Ravela Kishore Babu : వైసీపీకి మాజీమంత్రి రావెల కిశోర్ బాబు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అద్భుతమైన అవకాశం ఇచ్చారని, ఆయన నాయకత్వంలో మంత్రిగా కూడా పనిచేశానని తెలిపారు. దురదృష్టవశాత్తు కొన్ని కారణాలతో టీడీపీలో కొనసాగలేకపోయానని, అందుకు ఎల్లప్పుడూ బాధపడుతూనే ఉంటానని అన్నారు.
మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలించ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం వైసీపీతోనే సాధ్యమని భ్రమించి ఆ పార్టీలో చేరానన్నారు. ఆ పార్టీలు తిరస్కరించారని, సంక్షేమం, సమగ్ర రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమని నమ్మి కూటమికి చరిత్రాత్మక విజయం అందిచారని చెప్పారు. ఓ పక్క సమాజ సేవ చేస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోసం తన వంతు ప్రయత్నాలు చేయాలని వైసీపికి రాజీనామా చేసినట్లు కిశోర్ బాబు వెల్లడించారు.