
Sharad Pawar : కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి షిండే సర్కారు చేస్తున్న ప్రయత్నాలు సరిపోవట్లేదని, రైతులను ఆదుకునే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు.
ఈ మేరకు సోమవారం సీఎం ఏక్ నాథ్ షిండేకు ఆయన లేఖ రాశారు. డ్యాంలో నీటి మట్టాలు దారుణంగా పడిపోయాయని, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని తెలిపారు. సహాయక చర్యలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో అవసరమైన మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. లేకుంటే రైతుల కోసం తాను పోరాటానికి దిగాల్సి వస్తుందని శరద్ పవార్ హెచ్చరించారు.