ముఖ్యమంత్రి కేసీఆర్,ఐటీ మంత్రి కేటీఆర్ అత్యంత దుర్మార్గులని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా పొందుర్తిలో అకాల వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్న పంటలను రేవంత్ మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి పరామర్శించారు. మొక్కజొన్న రైతులను ఓదార్చారు. వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేశారు.
తెలంగాణ పల్లెల్లో వడగండ్ల వానపై రేవంత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్నదాతలు రాళ్ల వాన వల్ల పుట్టెడు దుఖంలో ఉంటే అయ్యా బీఆర్ఎస్ బహిరంగ సభల పేరుతో ఔరంగబాద్లో రాజకీయ మీటింగ్స్ పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఇక అయ్యా పరిస్థితి అలా ఉంటే కొడుకు ఆత్మీయ సమ్మేళనాల పేరు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారన్నారు విమర్శించారు.
ఇలాంటి నేతలను చూస్తుంటే కంపరం పుడుతోందని.కనీసం అన్నదాతలను ఓదార్చాలన్న సోయి వారికి లేకపోవడం దారుణమన్నారు. పంటలు దెబ్బతిని రైతులు కన్నీరుమున్నీరవుతుంటే ప్రభుత్వానికి కనీసం కనికరం లేదా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ కందాన్ వ్యవహార శైలిని రైతులు గమనిస్తున్నారని,అందువల్ల రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు.