
Filmfare : జాతీయంగా, అంతర్జాతీయంగా ఆశ్చర్యాలను క్రియేట్ చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీ సౌత్ లో సైతం తన సత్తా చాటుకుంది. ఇటీవల ఫిల్మ్ ఫేర్ ‘సౌత్ ఇండియన్ అవార్డులను అందజేశారు. మొత్తం సౌత్ నుంచి ఈ అవార్డులకు ఎంపిక చేయగా.. తెలుగు నుంచే ఎక్కువ మంది ఎన్నికయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ అవార్డులను అందుకోగా.. సాయి పల్లవి సైతం అవార్డును తన ఖాతాలో వేసుకుంది.
జాతీయ చలనచిత్ర అవార్డుల తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఫిల్మ్పేర్ సౌత్ ఇండియన్ అవార్డు’ను గురువారం ప్రకటించింది. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు పొందిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తెలుగు విభాగంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.
ఇక, ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉత్తమ డైరెక్టర్ గా రాజమౌళి అవార్డులను అందుకున్నారు. ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఉత్తమ నటి, ‘విరాటపర్వం’లో నటించిన సాయిపల్లవి క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఉత్తమ సహాయ నటులుగా ‘భీమ్లా నాయక్’ నుంచి రానా , ‘విరాటపర్వం’ నుంచి నందితా దాస్ ఎంపికయ్యారు. ఉత్తమ గేయ రచయితగా సీతారామ శాస్త్రి (సీతారామం సినిమాకు సంబందించి) ఎన్నికయ్యారు.
తమిళంలో ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ (విక్రమ్ సినిమా) ఉత్తమ నటిగా సాయిపల్లవి, తమిళంలో ఉత్తమ చిత్రంగా పొన్నియిన్ సెల్వం-1’ ఎంపికైంది. పొన్నియిన్ సెల్వం డైరెక్టర్ మణిరత్నం ఉత్తమ దర్శకుడిగా ఎన్నికయ్యారు. కన్నడంకు సంబంధించి ‘కాంతార’, మలయాళంకు సంబంధించి ‘న్నా థాన్ కేసు కుడు’ ఉత్తమ చిత్రాలుగా ఎన్నికయ్యాయి.