
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని తన పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్లు సమాచారం. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉండగా ఈ విషయం ఆయనకు తెలిసింది. దీంతో ఆయన వెంటనే తన పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్కు బయలుదేరారని అధికారులు, పార్టీ నాయకులు సూచించారు. అయితే, పవన్ కల్యాణ్ మాత్రం తన పర్యటనను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.