
మలేషియా ఎయిర్ లైన్స్ దీనిపై మీడియాకు అప్పట్లో ఒక ప్రకటన రిలీజ్ చేసింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 2.40 గంటలకు సంబంధాలు తెగిపోయాయని చెప్పింది. సంబంధాలు తెగిపోయిన 1.21 గంటలకు వెతుకులాట ప్రారంభించామని అధికారులు చెప్పారు. అప్పటికే వాతావరణంలో భారీ ప్రతి కూలత ఉందని అందుకే సిగ్నల్స్ కోల్పోయినట్లు తెలుస్తోందని మీడియా ప్రకటనలో యాజమాన్యం తెలిపింది.
MH370కి సంబంధించి అన్వేషణ 9 సంవత్సరాలుగా కొనసాగుతోంది. దీని కోసం మలేషియా ఎయిర్ లైన్స్ అత్యంత ఖర్చు చేశాయి. అన్వేషణ టీం మొదట సౌత్ చైనా సీ అండ్ అండమాన్ సముద్రం పై దృష్టి సారించింది. ఇన్ మార్ శాట్ ఉపగ్రహంతో విమానంతో కొనసాగిన కమ్యునికేషన్, కట్ అయిన ప్రదేశం నుంచి కొనసాగింది. సుధీర్ఘ కాలం ఈ ఫ్లైట్ కోసం అన్వేషణ సాగింది. అయితే దీని కోసం వెతుకుతున్న జాయింట్ ఎజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ తమ కార్యకలాపాలను 2017లో నిలిపివేసింది. తర్వాత ‘ఓషన్ ఇన్ఫినిటీ’ అనే సంస్థ జనవరి, 2018 నుంచి MH370 గురించి వెతకడం ప్రారంభించింది.
MH370 శకలాలను సముద్రం అడుగు భాగంలో గుర్తించామని, ఇందులో 239 మందికి సంబంధించిన అస్తి పంజరాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది పాత చిత్రం అంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. ఈ ఫొటో MH370ది కాదని స్కూబా డైవర్లు గతంలో ఒక విమాన శకలాలను కనుగొన్నారని వాటిని MH370కి అపాదించారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికీ MH370 ఎక్కడ ఉందో తెలియదని చెప్తున్నారు.






