Gandhi tour Will Soon in Telangana : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీలు తమ వ్యూహాలకు పదుునుపెడుతున్నాయి. తెలంగాణలో దాదాపు అక్టోబర్ వరకు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 3 ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. పాలకపక్షంతో ఎప్పటికప్పుడు తలపడుతున్న బీజేపీ ప్రజల్లోకి వేగంగా దూసుకుపోతోంది. ప్రజా సంక్షేమ యాత్రల పేరుతో ఎప్పటికప్పుడు కార్యాచరణ రచిస్తూ బండి సంజయ్ కార్యకర్తలు, నాయకులను ముందుకు నడిపిస్తున్నాడు.
సీనియర్లు, జూనియర్లు అంటూ కుమ్ములాటలతో సతమతవుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే ఫాంలోకి వస్తుంది. పాలకపక్షం బీఆర్ఎస్ ను, బీజేపీని రాష్ర్టంలో అడ్డుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగ గతంలో రైతుల కోసం రాహుల్ గాంధీ వరంగల్ లో సభ నిర్వహించి రైతు డిక్లరేషన్ ఇవ్వగా, నిన్నటికి నిన్న హైదరాబాద్ లోని సరూర్ నగర్ సభ సాక్షిగా ప్రియాంకా గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు ఈ సభను జయప్రదం చేయడంలో వారి వారి పాత్రను పోషించారు. ఇక స్వపార్టీ నేతలతో కుమ్ములాటలు ఉండవని, వ్యతిరేక పార్టీలతో అమీ తుమీ తేల్చుకోవాలని ప్రియాంకా గాంధీ హయాంలో నాయకులు తేల్చి చెప్పారు.
ఈ ఊపును కంటిన్యూ చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ బాట పట్టనుంది. పార్టీ ఢిల్లీ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఇక తరుచూ రాష్ట్ర బాట పట్టనున్నారు. ఇందులో భాగంగా జూన్ మొదటి వారంలో వీరి పర్యటనకు సన్నాహాలు చేస్తుంది తెలంగాణ కాంగ్రెస్ అధిష్ఠానం. ఈ టూర్ లో వారు బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ స్టడీ సెంటర్ ను కూడా ప్రారంభిస్తారని వినిపిస్తుంది. గతంలో ప్రకటించినట్లు 119 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరికి ఒక్కో ఎలక్ర్టిక్ స్కూటర్ ఇవ్వనున్నారు. వీరి పర్యటన నేపథ్యలో ఇంకా ఎలాంటి హామీలు ఇస్తారు.. ఎలాంటి డిక్లరేషన్లు ఉండబోతాయో చూడాలి మరి.