
మనం ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందే. లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం ఇష్టారాజ్యంగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు వస్తాయి. మలబద్ధకం కూడా వేధిస్తుంది. దీనికి ఉదయాన్నే పరగడుపున తీసుకునే డ్రింక్స్ వల్ల ఇబ్బందులు వస్తాయి. దీని నుంచి బయట పడాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కష్టాలు రావడం ఖాయం.
మధుమేహం తగ్గాలంటే మెంతుల నీరు ఉపయోగపడుతుంది. ముందు రోజు రాత్రి నానబెట్టిన మెంతులను ఉదయం ఖాళీ కడుపుతో తాగితే షుగర్ అదుపులో ఉంచుతుంది. చాలా మంది గ్యాస్ సమస్యలతో బాధపడుతుంటారు. దీనికి ముందు రోజు నీళ్లలో ఎండు ద్రాక్షను నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య నుంచి దూరం కావచ్చు.
మలబద్ధకం సమస్య రాకుండా ఉండాలంటే ఆఫ్రికాట్స్ ఎంతో ఉపయోగపడతాయి. వీటిని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య లేకుండా పోతుంది. ఐరన్ లోపంతో బాధపడేవారికి హలీమ్ సీడ్స్ మంచి పరిష్కారం చూపుతాయి. వీటిని రాత్రి నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తాగితే ఐరన్ లోపం పరారవుతుంది.
కొందరికి ఎముకల బలహీనత ఉంటుంది. దీనికి చియా సీడ్స్ ఓ చక్కని పరిష్కారం చూపుతాయి. వీటిని రాత్రి ఓ గ్లాసులో నానబెట్టి ఉదయం పరగడుపున తాగితే ఎముకలు బలంగా తయారవుతాయి. ఇలా మన అనారోగ్య సమస్యలను దూరం చేసుకునే వాటిలో వీటిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి.