
Mahesh Babu : ప్రముఖ సినీ నటుడు మహేష్బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు లేఖ రాశారు. రేపు జరగాల్సిన ఈడీ విచారణకు తాను హాజరుకాలేకపోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.షూటింగ్లో బిజీగా ఉండటమే ఇందుకు కారణమని మహేష్బాబు తెలిపారు. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నందున, విచారణకు హాజరయ్యేందుకు మరో తేదీని కేటాయించాలని ఆయన ఈడీ అధికారులను తన లేఖ ద్వారా కోరారు.
మహేష్బాబు లేఖపై ఈడీ ఎలా స్పందిస్తుందో, కొత్త తేదీని ఎప్పుడు కేటాయిస్తుందో చూడాలి. గతంలోనూ పలువురు సినీ ప్రముఖులను ఈడీ విచారించిన నేపథ్యంలో, మహేష్బాబుకు ఈడీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశమైంది. అయితే, షూటింగ్తో బిజీగా ఉన్నందున ఆయన విచారణకు గైర్హాజరు అవుతున్నట్లు సమాచారం.