16th Finance Commission : ఆంధ్రప్రదేశ్లో 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు ఏప్రిల్ 15 నుంచి 18 వరకు పర్యటించనున్నారు. వారి పర్యటనలో భాగంగా విజయవాడ చేరుకుని, అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడి, తిరుపతిలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపార వర్గాలతో సమావేశమవుతారు. చివరగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. ఈ పర్యటన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆర్థిక సహకారం పొందడానికి కీలకం కానుంది.
Breaking News