ఐపీఎల్ లో ఫ్రాంచైజీలకు పంట పండుతుంది. భారీగా డబ్బులు రావడం కామనే. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ పవర్ ఫుల్ జట్టుగా పేరు పొందడంతో దీని ఓనర్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీకి లాభాల పంట పండింది. టైటిల్ పోరు నుంచి వైదొలగినా వీరికి నష్టం మాత్రం రాలేదు. 16వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఫైనల్ కు చేరకపోయినా వీరికి లాభాలు వచ్చాయి. సక్సెస్ పుల్ టీంగా ముంబై ఇండియన్స్ అంబానీలకు వేల కోట్లు సంపాదించి పెట్టింది.
ముంబై ఇండియన్స్ టీంలో వంద శాతం వాటాతో నీతా, ముఖేష్ అంబానీలు యజమానులుగా ఉన్నారు. మిలియన్ డాలర్లకు 2008లో ఈ జట్టును కొనుగోలు చేసి తొలి సీజన్ లోనే రూ.916 కోట్లు ఖర్చు చేశారు. ఇంతవరకు ఐదు టైటిళ్లు సాధించి ఎక్కువ కప్ లు గెలుచుకున్న జట్టుగా ఆవిర్భవించింది. ఐపీఎల్ లోనే అత్యదిక ఆదాయం కలిగిన జట్టుగా పేరు గడించింది.
ది ట్రిబ్యూన్ ప్రకారం ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యుయేషన్ రూ. 10,070 కోట్లు పైమాటే. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ. 200 కోట్ల ఆదాయం పెరిగింది. ఇప్పటివరకు అత్యంత లాభాలు కలిగిన జట్టుగా ఖ్యాతి పొందింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఈ జట్టుకు ఆదాయం తగ్గకపోవడం గమనార్హం. మొత్తానికి ఇప్పుడు కూడా లాభాల పంట పండించుకుంది.
రిలయన్స్ బ్రాండ్ సినిమా ఐపీఎల్ టెలి కాస్టింగ్ హక్కులను రూ.22,290 కోట్లకు కొనుగోలు చేసింది. జియో సినిమా ఐపీఎల్ మొదటి హోస్ట్ చేయడం ద్వారా రూ.23 వేల కోట్ల విలువైన ఆదాయం సంపాదించుకుంది. రాబోయే రోజుల్లో కూడా వేల కోట్లతో ఈ ఫ్రాంచైజీ దూసుకుపోనుంది. రిలయన్స్ ద్వారా భారీ ఆదాయం సమకూరుతోంది.