
అయితే ఈ మెగా టోర్నీని ఇంగ్లాండ్ కు మార్చాలని ఐసీసీ భావిస్తు్న్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ మరో ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈలోగా ఏర్పాట్లకు అంతగా ఎక్కడా వీలుకాదు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్లో ఈ మెగా టోర్నీ ఏర్పాటుకు ఇంగ్లాండ్ ను కోరాలని చూస్తున్నదని తెలుస్తున్నది. అయితే ముందుగా ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2030లో ఇంగ్లాండ్ లో ఈ మెగా టోర్నీ నిర్వహించాల్సి ఉంది. అందుకే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి ఇంగ్లాండ్ లో ఈ టోర్నీ నిర్వహించి, 2030 లో అమెరికాలో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈలోగా అమెరికాలో కూడా ఐసీసీ ప్రమాణాలతో అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అనుకుంటున్నది.
ప్రస్తుతం యూఎస్ఏ కేవలం రెండు స్టేడియాల్లో మాత్రమే అంతర్జాతీయ స్థాయి వసతులు ఉన్నాయని తెలుస్తున్నది. వీటిలో ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రో వార్డ్ రీజినల్ పార్క్ ఒకటి కాగా, టెక్సాస్ లోని ముసా స్టేడియం రెండోది. అయితే టీ 20 కోసం మరిన్ని స్టేడియాలను అభివృద్ధి చేయాల్సి వస్తున్నది. సమయం తక్కువగా ఉన్నందున ఇప్పుడు ఈ ఏర్పాట్లు చేయడం అసాధ్యమని ఐసీసీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇక వేదిక మార్చే అవకాశమే ఎక్కువ ఉన్నదని తెలుస్తున్నది. అమెరికాలో క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించేందుకు నిర్ణయించడం ఇదే తొలిసారి. అయితే ఇది కూడా ఇప్పుడు రద్దయ్యే అవకాశం ఉంది.






