Jaiswaraajya TV : దేశంలో ఏ అసెంబ్లీ ఎన్నికలు జరుగనంత ఉత్కంఠగా, ఆసక్తిగా ఏపీలో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని కోట్లాది మంది ఉత్కంఠగా ఎదురుచూశారు. జనాల అంచనాలకు తగ్గట్టే ఎన్నికల ప్రచారం, పోలింగ్, ఫలితాలు విడుదల అయ్యాయి. ఇందులో మీడియా పాత్ర కీలకంగా ఉంది. ఎన్నికల ప్రచారం, పోలింగ్, ఫలితాల వివరాలను ఎప్పటికప్పుడు అందించి జైస్వరాజ్య టీవీ విశేష జనాదరణ పొందింది. రాజకీయ పార్టీల నేతలు, నాయకులు, అభ్యర్థులకు సంబంధించిన వార్తలు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లను చూడడానికి ప్రపంచం నలుమూలాల ఉన్న తెలుగువాళ్లు జైస్వరాజ్య టీవీని ఫాలో అయ్యారు.
తాజాగా ఏపీ అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత జగన్ ప్రెస్ మీట్ , పవన్ కు ఆయన సతీమణి వీరతిలకం దిద్దడం, చంద్రబాబు ఇంటా విజయోత్సవాలను జైస్వరాజ్య టీవీలో లక్షలాది మంది వీక్షించారు. జగన్ ప్రెస్ మీట్ ను ఏకంగా 8,44,124 మంది జైస్వరాజ్య టీవీలో చూశారు. అలాగే వైసీపీ కార్యాలయం బోసిపోయిన వార్తను 1,11,027 మంది వీక్షించారు. గత 48 గంటల్లో 21,83,136 మంది జైస్వరాజ్య టీవీని చూశారు. మెయిన్ స్ట్రీమ్ చానళ్లకు దీటుగా సోషల్ మీడియాలో ఇంతమంది చూసిన ఘనత జైస్వరాజ్య టీవీకి మాత్రమే దక్కింది. మొత్తం మీద ఏపీ ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం కోట్ల వీక్షణలు ఉండడం విశేషం.

ఇక ఏపీ ఎన్నికల సందర్భంగా జైస్వరాజ్య టీవీ అశేష జనాదరణ పొందడమే కాదు పలువురు అభ్యర్థులకు ప్రచార కవరేజీ ఇచ్చి వారిని జనాలకు దగ్గర చేసింది. దీంతో వారి విజయం సునాయాసమైంది. భాష్యం ప్రవీణ్(టీడీపీ), సుజనా చౌదరీ(బీజేపీ), దాసరి శ్రావణ్(టీడీపీ) సహ పలువురికి జైస్వరాజ్య టీవీ కవరేజీని ఇచ్చింది. వీరి గెలుపు కోసం ప్రత్యేక కథనాలు అందించి ప్రజల్లో వారి ఆదరణను మరింత పెంచింది. దీంతో వారి ఘన విజయంలో జైస్వరాజ్య టీవీ పాలుపంచుకుంది.
తాజా విజేతల గురించి జైస్వరాజ్య టీవీ చేసిన ప్రతీ స్టాటజీ నిజమైంది.. జైస్వరాజ్య ఏం చేసినా విజయవంతమైందనే చెప్పవచ్చు. జైస్వరాజ్య టీవీ కవరేజీ ఇచ్చిన వారు 100కు 100 శాతం గెలిచారు. ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. తమను గెలిపించడంలో సోషల్ మీడియాలో జైస్వరాజ్య పాత్ర చాలా ఉందని కొనియాడారు. జైస్వరాజ్య టీవీ లోని ప్రతి సిబ్బంది తమ గెలుపునకు కృషి చేశారన్నారు. కాగా, గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలకు జైస్వరాజ్య టీవీ క్యాంపెయినింగ్ చేయగా వారు ఘన విజయం సాధించడం గమనార్హం.
Read more : ఆ అరెస్టే జగన్ కొంపముంచిందా?