టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువ గళం పాదయాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైసీపీ పై నిప్పులు చెరిగారు.
ప్రజలను పట్టించుకొని జగన్… పాక్ష్యన్ రాజకీయాలను చేస్తున్నాడని ఎద్దేవా చేసాడు…హామీలను అమలు చెయ్యని జగన్ పాలించే హక్కు లేదని అన్నారు… తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు…
యువ గళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి సీఎం జగన్ భయపడుతున్నారని, తనను అడ్డుకోవడానికి మొదట పోలీసులను పంపించారని, ఆ మోడల్ వర్కౌట్ కాక పోవడంతో, ప్రస్తుతం వైసీపీ వారిని పంపిస్తున్నారని పేర్కొన్నారు. పద్ధతిగా సాగనిస్తే పాదయాత్ర.. లేదంటే దండయాత్ర అంటూ లోకేష్ తేల్చిచెప్పారు. వివేకా హత్య కేసు దారి మళ్లించడానికి సీఎం జగన్ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారన్నారు.