Last Chance
Last Chance : టీం ఇండియా క్రికెట్ జట్టులో ఎంపిక కావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది ఏకంగా కెప్టెన్ గా చాన్స్ వచ్చింది. అయినా శుభ్ మన్ గిల్ జింబాబ్వే తో సిరీస్ లో రెండు టీ 20 ల్లో కలిసి కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లు ఓ కన్నేసినట్లు తెలుస్తోంది.
జులై 10 సాయంత్రం జింబాబ్వే తో మూడో టీ 20 మ్యాచ్ జరగనుంది. అందులో కూడా కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఆడనున్నాడు. శుభ్ మన్ గిల్ వన్డే వరల్డ్ కప్ తర్వాత ఫామ్ కోల్పోయాడు. దీంతో అతడి స్థానంలో టీ 20 వరల్డ్ కప్ కు యశస్వి జైశ్వాల్ ను ఎంపిక చేశారు. అయితే గిల్ కు పోటీగా మరో నలుగురు ఓపెనర్లు తీవ్రంగా పోటీపడుతున్నారు.
అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, యశస్వి జైశ్వాల్, రుత్ రాజ్ గైక్వాడ్ లాంటి యంగ్ అండ్ ప్రొఫెషనల్ ఆటగాళ్లు గిల్ కు పోటీ గా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ సిరీస్ లో గిల్ ఆడితేనే తనకు జట్టులో చోటు సుస్థిరమవుతుంది. లేకపోతే మరో పృథ్వీ షా అవడం ఖాయమని నెటిజన్లు క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టీ 20 వరల్డ్ కప్ లో విజయం సాధించిన ఆటగాళ్లలో సంజు శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైశ్వాల్ ను జింబాబ్వే సిరీస్ కు ఎంపిక చేయగా.. మూడో టీ 20 నుంచి అందుబాటులోకి రానున్నారు. వీరి స్థానంలో జట్టులోకి వచ్చిన సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ లు తిరిగి ఇండియా వెళ్లిపోనున్నారు. టీం ఇండియాలో సుస్థిర స్థానం కోసం యువకులు పోటీ పడుతున్న వేళ ఫామ్ కోల్పోయి కెప్టెన్ శుభ్ మన్ గిల్ గడ్డు కాలం వెళ్లదీస్తున్నాడు. ఇప్పుడు మాత్రం రాణించకపోతే ఇక చివరికి జట్టులో చోటో కోల్పోవడం ఖాయమని అంటున్నారు. ఇదే లాస్ట్ అవకాశం అని చెబుతున్నారు.