
IIT Bombay – IIT Delhi : ప్రపంచంలోని 150 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ చోటు సంపాదించుకున్నాయి. ఇదే జాబితాలో అమెరికాకు చెందిన మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) వరుసగా 13వ సారి 1వ ర్యాంక్ నిలబెట్టుకుంది. లండన్ కు చెదిన ఉన్నత విద్య విశ్లేషకుడు క్వాక్వెరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) బుధవారం ప్రకటించిన ‘వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ – 2025’ వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన ఎంఐటీ అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా 13వ సారి తన ప్రథమ స్థానాన్ని నెలబెట్టుకుంది.
మన దేశానికి సంబంధించి గత ఏడాది 149వ ర్యాంకు సాధించిన ఐఐటీ బాంబే ఈసారి 31 ర్యాంకులు ఎగబాకి 118వ స్థానంలో నిలిచింది. ఐఐటీ ఢిల్లీ 47 పాయింట్లు మెరుగుపర్చుకుని 150వ స్థానం సాధించింది. గౌరవనీయ విశ్వవిద్యాలయాల ర్యాంకింగుల్లో పట్టభద్రులకు మెరుగైన ఉపాధి కల్పిస్తున్న ఢిల్లీ ఐఐటీ 44 స్థానంలో నిలిచినట్లు క్యూఎస్ జాబితా పేర్కొంది. భారతదేశ విశ్వవిద్యాలయాల్లో సుస్థిరత కార్యక్రమాలను బలోపేతం చేయాల్సిన అవసరముందని ఈ నివేదిక సూచించింది.