
India vs Bangladesh : రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పుడు ఆంటిగ్వాలో సూపర్ 8లో తన రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా దాదాపు సెమీఫైనల్కు అర్హత సాధిస్తుంది. భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రాణించకపోవడంతో టీమ్ ఇండియాను కొంత ఆందోళన కు గురిచేస్తున్నది.
కోహ్లి , రోహిత్ విఫలమవుతుండగా టీమిండియా మిడిల్ ఆర్డర్ తమ బాధ్యతను నెరవేరుస్తోంది. శివమ్ దూబే సైతం రాణించలేకపోతుండడంతో బంగ్లాదేశ్తో జరిగేమ్యాచ్ కు తుది జట్టు నుంచి అతడిని తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. శివమ్ ను పక్కన పెడితే సంజు శాంసన్ బెస్ట్ ఆప్షన్ అని నిరూపించుకోవచ్చు.
భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. ఫామ్ కోల్పోతున్న ఈ జోడి బంగ్లాపై రాణించే అవకాశాలు లేకపోలేదు. అంటే వీరిద్దరూ ఒక్కసారి క్రీజులో నిల్చుంటే పరుగుల వరద పారించే అవకాశాలు ఉన్నాయి. మూడో నంబర్లో తనని తాను నిరూపించుకుంటున్న రిషబ్ పంత్ కూడా అదే క్రమంలో ఆడనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్పై జట్టు స్కోరు 180 దాటిస్తున్న సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో ఉంటాడు.
ఈ ప్రపంచకప్లో శివమ్ దూబే భారత్ తరఫున ఐదో స్తానంలో నిరంతరం ఆడుతున్నాడు, కానీ బ్యాట్ కు పని చెప్పడం లేదు. బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్ లో తొలగించే అవకాశాలు అంతగా లేవు. ఒక వేళ పక్కనపెడితే సంజు శ్యాంసన్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శివమ్ ను పక్కన పెడితే సంజుకు అవకాశం లభిస్తుంది. బంగ్లాదేశ్పై హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో ఉండగా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఏడు, ఎనిమిది స్థానాల్లో ఆడనున్నారు. రవీంద్ర జడేజా ఇప్పటి వరకు అంతగా రాణించలేకపోయాడు, కానీ అతను తుది జట్టులో ఉంటున్నాడు.
అంటిగ్వా గ్రౌండ్ ఫాస్ట్ బౌలర్లకు పూర్తిగా సహకరిస్తునంది. తరువాత స్పిన్నర్లకు సైతం మద్దతు దొరుకుతుంది. దీంతో టీమ్ ఇండియా మళ్లీ ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. సూపర్ 8 తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై కుల్దీప్ యాదవ్కు అవకాశం లభించింది. 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ స్థానానికి డోకాలేదు. బుమ్రా, అర్ష్దీప్ ఆఫ్ఘనిస్తాన్పై 3-3 వికెట్లు తీశారు, ఇద్దరూ ఫాస్ట్ బౌలర్లుగా జట్టులో ఉంటారు.
టీమిండియా తుది జట్టు?
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే లేదా సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.