NDA Victory 2024 Celebrations : భారత్ లో ముచ్చటగా మూడో సారి (3.O) నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో యావత్ ప్రపంచం (కొన్ని దేశాలు తప్ప) సంబురాల్లో ఉంది. ఎందుకంటే మోడీ వరల్డ్ విజన్ నేత కావడమే. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్, అంతే దయ, కరుణ గల దేశం కూడా మరోటి లేదు. ఆ విషయాన్ని మోడీ కరోనా సమయంలో రుజువు చేశారు కూడా. అమెరికాకే పారాసిటమాల్ ట్యాబ్లెట్లను సరఫరా చేయడంతో పాటు పేద దేశాలకు ఉచితంగా కరోనా నివారణ వ్యాక్సిన్ అందజేసి ప్రాణాలు కాపాడి దేవుడయ్యారు.
అలాంటి నేత మరో సారి అంతే పవిత్రమైన భూ భాగం నుంచి ప్రపంచ గతిని మార్చబోతున్నారని అందరూ సంబుర పడుతున్నారు. ఇందులో భాగంగానే అమెరికాలోని ప్రవాస భారతీయులు ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ పేరుతో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ కార్యక్రమం నిర్వహించింది. రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ లో జూన్ 11వ తేదీ (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు బీజేపీ గెలుపుపై సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకులు (key note speakar)గా డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి ఫౌండర్ యూబ్లడ్ యాప్ గారు ప్రసంగించారు.
‘మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరంతా దేశ, ప్రపంచ స్థితి గతులు మార్చే నాయకులని ఆయన కీర్తించారు. మోడీ 3.O, ఏపీలో చంద్రబాబు 2.O, పవన్ ళ్యాణ్ 1.O వీరు ఏపీతో పాటు దేశాన్నిమారుస్తారని దేశ ప్రజలకు పూర్తి నమ్మకం ఉంద’ని జై గారు అన్నారు. ఆయననతో పాటు వక్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. భారత్ రానున్న ఐదేళ్లలో మరో సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతోందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచంతో గొప్ప దేశంగా భారత్ కీర్తించబడుతుందని, ఇది ప్రతీ భారతీయుడు గర్వ పడాల్సిన క్షణం అని అన్నారు.
All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya TV & JSW Tv Global Director).