
Gurukula Hostel : సిద్దిపేట జిల్లాలోని చేర్యాలలోని గురుకుల హాస్టల్ లో ఇంటర్ విద్యార్థులు పదో తరగతి పిల్లలపై దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో దాడికి పాల్పడగా దెబ్బల ధాటికి తట్టుకోలేక విద్యార్థులు వీధుల వెంబడి పరుగులు తీస్తూ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.
హాస్టల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు వారి తరగతి గదిలో చదువుకుంటున్న సమయంలో అదే హాస్టల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు అల్లరి చేస్తున్నారనే నెపంతో అకారనంగా దాడికి పాల్పడ్డారు. బెల్టులతో, కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో పదో తరగతి విద్యార్థులు గోడదూకి పరుగులు తీశారు. తలదాచుకునేందుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేర్యాల పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు.