
Telangana Internet : తెలంగాణలో రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలిదశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2096 పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు.
ప్రభుత్వం అందించే కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్వర్క్, టెలిఫోన్, పలు OTTలను వీక్షించవచ్చు. 20MBPS స్పీడ్తో నెట్ తో పని చేయనుంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.






