
Allu Arjun – Pawan Kalyan : పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నా.. మరోసారి రిలీజ్ వాయిదా పడింది. దీనికి అనేక కారణాలు అనుకుంటున్నారు. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కు కాకుండా వైసీపీ లీడర్ కు సపోర్టుగా ప్రచారం చేయడానికి వెళ్లిన అల్లు అర్జున్ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డాడు. ఆయన ప్రచారం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోవడమే కాకుండా పవన్ కల్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.
దీంతో పవన్ కల్యాణ్ గెలిచినా కూడా ఇప్పటి వరకు ఆయన్ని అల్లు అర్జున్ కలవలేదు. పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతల మండలి సభ్యులు అందరూ పవన్ ను కలిసి ఏపీలో సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన వసతులు, నిర్మాణ రంగం తదితర అంశాలపై చర్చించారు.
ఏపీలో జనసేన ఎమ్మెల్యేకు సినిమాటోగ్రఫీ మంత్రిగా అవకాశం కల్పించారు. కందుల దుర్గేశ్ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. అల్లు అర్జున్ ఇప్పటి వరకు పవన్ ను కలవకున్నా.. అల్లు అరవింద్ మాత్రం టాప్ నిర్మాతగా పవన్ కల్యాణ్ ను కలిశాడు. పవన్ కల్యాణ్ సినిమా రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చూస్తున్నాడు.
అయితే పవన్ కల్యాణ్ ను కలవాలని అల్లు అర్జున్ ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. ఈ వివాదానికి తెర పెట్టాలని పవన్ ను కలిసి తామంతా ఒకటే అని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. అయితే పవన్ కల్యాణ్ అభిమానులు దీన్ని ఎలా తీసుకుంటారో చూడాలి. అయితే పుష్స 2 రిలీజ్ కు ముందే పవన్ ను కలిస్తే సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారని తెలుస్తోంది. దీని కోసం అల్లు అర్జున్ వెనక్కి తగ్గుతాడా.. మళ్లీ పవన్ కల్యాణ్ ను కలుస్తాడా.. ఒకవేళ పవన్ ను కలిస్తే ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.