35.7 C
India
Friday, May 15, 2026
More

    Change in Jagan : జగన్ లో ఆ మార్పునకు కారణం ఇదేనా..? ఎందుకిలా..?

    Date:

    Change in Jagan : ఇటీవల ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అందరిలో ఒక ప్రశ్న మెదిలింది. అదేంటంటే? జగన్ వస్తారా? రారా? అని. కానీ ఎవరూ ఊహించనట్లు ఆయన వచ్చారు.. వెళ్లారు.. కానీ ఆయన తీరులో ఆత్మన్యూనతాభావం ఉన్నట్లు కనిపించింది. అలవా ఉన్ననప్పుడు ఆయన ఏదైనా విషయం చెప్పాలనుకుంటే తడబడతారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. జగన్ తీరు కూడా అలానే ఉంది.

    జగన్ అసెంబ్లీలోకి ప్రవేశించడమే వెనక గేటు నుంచి వచ్చారు. ఎందుకంటే.. వచ్చే దారిలో.. అమరావతి రైతులు తనపై దాడి చేస్తారని ఆయన అలా వచ్చారనే వాదన వినిపిస్తోంది. సరే వచ్చారు కదా.. అనుకుంటే.. హుందాగా సభలోకి రావాల్సిన ఆయన.. తన ప్రమాణ స్వీకారం కోసం పేరు పిలిచిన సమయంలోనే వచ్చారు. వచ్చి ఐదు నిమిషాలు చివరి బెంచ్‌లో కూర్చొని ప్రమాణ స్వీకారం చేశాక.. అసెంబ్లీలో ఉండకుండా.. తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు. ఇక అటునుంచి అటు ఇంటికి వెళ్లారు. అప్పుడు కూడా వెనక గేటు నుంచే వెళ్లారు. ఇలా నిన్న జగన్.. అడుగడుగునా.. ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేని వ్యక్తిలా వ్యవహరించారనే టాక్.

    జగన్ ఓడిపోయినా వైసీపీకి 40 శాతం ఓటు షేర్ ఉంది. కాబట్టి ఓట్లు వేసిన వారికి ప్రతినిధిగా జగన్ సభలోకి ధైర్యంగా రావాలి, కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉండాలి. ప్రస్తుత ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలపై నిలదీయాలి. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలకు మద్దతుగా వ్యవహరించాలి. తను కూడా ఒక ప్రజా ప్రతినిధని మరువద్దు, గంభీరంగా ఉండాలి.  తనకు ఓటు వేసే వారి పక్షాన అసెంబ్లీలో తాను ఉన్నానని జగన్ ధైర్యంగా నిలబడాలి. అది మాని తనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించడం సబబు కాదనే వాదన వినిపిస్తోంది.

    ఇవాళ (జూన్ 22) కూడా వైసీపీ.. అసెంబ్లీకి వెళ్లద్దని నిర్ణయించుకుంది. మరి ఆ పార్టీకి ఓట్లేసిన వారి సంగతేంటి? వారి తరఫున అసెంబ్లీలో ఎవరు ఉండాలి? ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి కదా. కాడి వదిలి సేద్యం చేస్తానంటే ఎలా? ఇదే ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది. ఫలితాలు వచ్చినప్పటి నుంచి జగన్ అదోలా వ్యవహరిస్తున్నారని, తనకు ఓట్లు ఎందుకు వేయలేదో అని ప్రజలను తప్పుపుడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఓట్లు వేసిన వారికి భరోసాగా ఉండాల్సిన ఆయన.. అసెంబ్లీకి వెళ్లద్దనే తీరు.. సరైనది కాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jogi Ramesh : జోగి రమేష్‌పై ఉచ్చు బిగుస్తోందా?

    Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయ దూకుడే ఇప్పుడు...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్ ఖేల్ ఖతమైనట్టేనా?

    Sajjala Bhargav : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి...

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...