29.3 C
India
Thursday, January 23, 2025
More

    Congress Strategy : ‘‘కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తే చాలు..’’ ఇదే కాంగ్రెస్ స్ట్రాటజీ!

    Date:

    KCR-Congress
    Congress Strategy

    Congress Strategy : 2001 నుంచి ఇప్పటిదాక తెలంగాణ ఉద్యమ నేతగా, పదేళ్లు సీఎంగా ఎవరూ ఔనన్నా కాదన్నా కేసీఆర్ ఇమేజ్ ను దాటొచ్చే నాయకుడు తెలంగాణలో లేడనే చెప్పాలి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగ నోటిఫికేషన్ల అవకతవకలే. ఎన్నికలకు మూడు నెలల కిందటి దాక కాంగ్రెస్ కు అధికారంలోకి వస్తామనే ధీమా కూడా లేదు. ఆ ప్లేస్ లో బీజేపీ ఉండేది. కానీ ఎప్పుడైతే గ్రూప్ 1 రెండు సార్లు రద్దు కావడంతో పాటు ఇతర నోటిఫికేషన్లు కొలిక్కి రాకపోవడంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ముఖ్యంగా కేసీఆర్ పై తీవ్ర అసహనం పెరిగిపోయింది.

    బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమంది యువత కూడా ఉద్యోగాల విషయంలో కేసీఆర్ ను విమర్శించడం మనం చూసే ఉంటాం. ఇలా నిరుద్యోగుల తీవ్ర ఆగ్రహానికి గురైన బీఆర్ఎస్ గద్దె దిగక తప్పలేదు. ఇక కాంగ్రెస్ 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి అందరూ చెప్పేదేమిటంటే కాంగ్రెస్ పై ప్రేమతో జనాలు ఓట్లు వేయలేదు.. బీఆర్ఎస్ పై కోపంతోనే కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేశారని. ఇది వంద శాతం నిజం.

    ఈ విషయం తెలిసే బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలంటే ప్రజల్లో కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ ను డ్యామేజీ చేయాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. అందుకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఇంతవరకు ఒక్క కొత్త పథకాన్ని కూడా పట్టాలపైకి తేలేదు. ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు..ఇవన్నీ రెడీమేడ్ హామీలే కాబట్టి వెంటనే అమల్లోకి వచ్చేశాయి. ఇక మిగతా గ్యారెంటీలు అలాగే ఉన్నాయి..మ్యానిఫెస్టోలో చేర్చినా ఇతర అంశాలూ ఉన్నాయి.

    అయితే వీటన్నంటికంటే కేసీఆర్ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోవడమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. బొటాబోటీ మెజార్టీ ఉన్న తమ ప్రభుత్వానికి కేసీఆర్ రూపంలో ముప్పు ఉందని భావించే..ఆయన ఇమేజ్ ను ప్రజల్లో డ్యామేజీ చేసే పని పైనే దృష్టి పెట్టింది. ప్రధానంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతి, డొల్లతనం, అవకతవకలపై ప్రతీ రోజూ వార్తల్లో నిలుపుతూ..అదొక వేస్ట్ ప్రాజెక్టు అని, లక్ష కోట్లు పెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. తద్వారా కేసీఆర్ కాళేశ్వరం పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేశారని..ఆయన్ని తెలంగాణ సమాజం ముందట దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.

    రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కోలుకోకుండా చేసి.. ఆ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికి ప్రజల సపోర్ట్ కావాలి కాబట్టి..తెలంగాణ పల్లెల్లో కేసీఆర్ పై ఉన్న ఇమేజ్ ను డ్యామేజీ చేస్తే ఇక తమకు తిరుగుండదు..అని అంచనా వేస్తోంది. ఇదే జరిగితే తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని క్రమంగా తుడిచివేసే ప్రక్రియను అమలు చేయాలని చూస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం, అధికారిక ముద్రలో మార్పు కూడా ఇలాంటిదే. ఏదేమైనా కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న సానుభూతి పెరగకుండా చూడడం..ఆయన్ను అవినీతిపరుడిగా, తెలంగాణకు మోసం చేసిన వ్యక్తిగా ప్రజల ముందు నిలబెట్టడం ద్వారా మాత్రమే తమ ప్రభుత్వం ఐదేండ్లు సాఫీగా సాగుతుందని అంచనా వేస్తోంది.

    Share post:

    More like this
    Related

    Revanth : అల్లు అర్జున్ అరెస్ట్ పై మరో సారి స్పందించిన రేవంత్

    CM Revanth Reddy : అల్లు అర్జున్ అరెస్టు చట్టం ప్రకారమే జరిగిందని...

    Rare Disease : పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు

    Rare Disease : పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది....

    Telangana : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

    Telangana : తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర...

    Cold : పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ

    Cold in Morning : రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR : అరెస్ట్ కు సిద్ధమైన కేటీఆర్.. గర్వంగా జైలుకు వెళ్తానని ట్వీట్..

    KTR : కొడంగల్ నియోజకవర్గంలో ఇటీవల ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడిలో...

    Harish Rao : మూసీ సుందరీకరణ పేరిట ‘రియల్’ వ్యాపారం: హరీశ్ రావు

    Harish Rao : మూసీ సుందరీకరణ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం...

    Actor Suman : యాదాద్రి నరసింహస్వామి సేవలో నటుడు సుమన్.. మాజీ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు

    Actor Suman : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని గురువారం (అక్టోబరు...

    journalists : జర్నలిస్టులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా..? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో మరి!

    journalists : కరీంనగర్ లోని జర్నలిస్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం పండుగు పూట...