
Jagan 2.0 Padayatra : 2024 ఎన్నికల్లో ఎదురైన పరాజయం తరువాత, వైసీపీ అధినేత జగన్ మళ్లీ ప్రజల్లోకి రాబోతున్నారన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించిన ప్రకారం, జగన్ 2027లో “పాదయాత్ర 2.0” ప్రారంభించనున్నారు. పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో గుడివాడ మాట్లాడుతూ, నాలుగు సంవత్సరాలు ఓపిక పట్టి కృషి చేస్తే అధికారంలోకి తిరిగి వస్తామన్నారు. కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చిన గుడివాడ, పార్టీని వీడే వారిని బతిమాలాల్సిన అవసరం లేదని సూచించారు. పాదయాత్రతో జగన్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లి మద్దతు పొందాలని పార్టీ వ్యూహం స్పష్టమవుతోంది.