31.9 C
India
Sunday, April 19, 2026
More

    జగన్ కు ఆయనంటే అస్సలు నచ్చడం లేదట..!

    Date:

    cm Jagan
    cm Jagan

    తాన మాట తప్ప ఏవరి మాట వినని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి  తత్వం  ఏవరికి బోధ పడదని పార్టీ వర్గాల్లో, ఏపీ ప్రజల్లో  జరుగుతున్న చర్చ అందుకు తగ్గట్లుగానే ఆయన వ్యవహార శైలి ఉంటుంది. తాను చెప్పినట్లుగానే  పార్టీగానే, ప్రభుత్వం గాని నడవాలి .. తనను కాదని ఏవరు ఏం నిర్ణయం తీసుకోకుడదు అని హుకుం జారీ చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

    అందుకు తగ్గట్లుగానే  పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు గడుస్తున్నా పార్టీలో నిర్ణయాలన్ని జగన్ తప్ప ఏవరు తీసుకోరు అనడంలో అతియోశక్తి లేదు.. మంత్రులు పేరుకు మాత్రమే మంత్రులు తమ శాఖల్లోని నిర్ణయాలు తీసుకోవాలన్న సీఎం నుంచి అదేశాలు రావాలనే ప్రచారం జనంలో ఉంది. అయితే ఇప్పుడు జగన్ చూపు  ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వైపు మళ్లిందని అంటున్నారు అధికారులు…

    ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అంటే అస్సలు నచ్చడం లేదని   ఆధికారవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.  నిజానికి ఆయన పూర్తి స్థాయి డీజీపీ కాదు. అడహాక్ డీజీపీనే కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఆ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం త్వరగా పూర్తి చేయడం లేదు. కారణం ఏదైనా ఆయన డీజీపీగాఉన్నారు. కానీ జగన్ ఆలోచనలకు తగ్గట్లుగా ఆయన మసలుకోలేకపోతున్నారు. ఆయన కోరుకునే అరాచక స్థాయిని పోలీసులు అందుకోలేకపోతున్నారన్న గుసగుసలు వినిిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ పోలీసుల నుంచి ఇంకా చాలా దూకుడు కోరుకుంటున్నారు. కానీ లాంటిది కనపడటం లేదంటున్నారు.

    అసలు సంబంధం లేని ఆదాయార్జన శాఖలపై సమీక్షలో సీఎం జగన్ ఏసీబీ డీజీగా రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించాలని స్పష్టం చేశారు. ఆయన అటు డీజీపీగా ఇటు ఏసీబీ డీజీగా ఉండలేరని చెప్పుకొచ్చారు. అందుకే ఆ సమీక్షలో తనకు ఎదురుగా కనిపించిన రవిశంకర్ అయ్యన్నార్ ను ఏసీబీ డీజీగా నియమించాలని జగన్ సూచించారు. కానీ రవిశంకర్ అయ్యన్నార్ కుఇంకా డీజీ హోదా రాలేదు. అంతసీనియర్ కాదు. ఆయన ఏడీజీనే. అది తెలియకుండా జగన్ ఆయనను నియమించాలన్నారు. పక్కన వాళ్లు చెప్పినా పట్టించుకోలేదు. ఆ నియామం జరుగుతుందో లేదో కానీ జగన్ మాత్రం అర్జంట్ డీజీపీ నిర్వహిస్తున్న ఓ కీలకమైన విభాగాన్ని ఆయన నుంచి తప్పించాలనుకున్నది మాత్రం స్పష్టమయిందంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొత్త డీజీపీ ఎంపిక విషయంలో కేంద్రం నిబంధనలు గుర్తు చేసినా లేదా జగనే ఆయన వద్దని కొత్త వారిని ఎంపిక చేసుకున్నా.. డీజీగా చేసి రవీంద్రనాథ్ రెడ్డి అప్రాధాన్య పోస్టులోకి వెళ్లాల్సి ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP DGP : ఆ 16 మంది ఐపీఎస్‌లకు షాక్.. మెమోలు జారీ చేసిన ఏపీ డీజీపీ!!

    AP DGP : గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ మంత్రులు, అధికార...

    AP Politics : కులం పేరుతో ఏపీలో ఈ అరాచకాలు ఎన్నాళ్లు?

    AP Politics : కుల రహిత సమాజం కోసం గత పాలకులు...

    Jagan Stone Attack : సీఎం జగన్ పై రాయి దాడి కేసు.. నిందితుడికి బెయిల్

    Jagan Stone Attack : ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం జగన్...