Jagan
Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతూ వస్తోంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన వారంతా పార్టీని వీడి వెళ్లే సూచనలు చేస్తున్నారు. కానీ జగన్కు ఆ సమస్య లేదు. ఎందుకంటే ఆయన దూరదృష్టితో ఆలోచించి తన పరివారంతో చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయించారు. దీంతో రెండు పార్టీల్లోకి వెళ్లే అవకాశం లేకుండా చేశారు. ఇది జగన్ అతిపెద్ద రాజకీయం. లేదంటే ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయి ఉండేవారే.
తాజా సమాచారం ప్రకారం.. ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ వైపునకు ఆశగా చూస్తున్నారట. శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకియా ఖానం మంత్రి ఎన్ఎండీ ఫరూక్ను కలిసి పార్టీలో చేరేందుకు చంద్రబాబు నాయుడిని ఒప్పించాలని కోరినట్లు తెలుస్తోంది.
జగన్ తమకు ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ ఏనాడూ పట్టించుకోలేదని, వైసీపీలో అవమానాలు తప్ప సముచిత గౌరవం లేదని చెప్పారు. వైసీపీ ఓడిపోయాకనే తొలిసారి జగన్ తమ మొహాలు చూశారని ఆమె చెప్పుకచ్చారు. ఒకవేళ తనని చేర్చుకునేందుకు బాబు అంగీకరిస్తే మరో నలుగురు ఎమ్మెల్సీలు తన వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపినట్లు సమాచారం.
వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేనలో చేరే పరిస్థితి లేదు. కానీ జగన్తో సహా వైసీపీలో ప్రతీ ఒక్కరికీ అవినీతి, అక్రమాల కేసుల భయం ఉంది. ఆ భయంతో కూడా వారు పార్టీ మారేందుకు వీలు లేకుండా చేసి జగన్ అందరినీ వైసీపీలో బందించి ఉంచారని చెప్పక తప్పదు. కనుక వైసీపీలో బందీలుగా ఉండిపోయిన ఆ పార్టీ నేతల పరిస్థితి, భవిష్యత్ ఆగమ్యగోచరం. దీనికి అధినేత జగనే కావడం విశేషమే కదా?