Jagan Trolls : ఏపీ ఎన్నికలు భవిష్యత్ పాలకులకు ఒక అధ్యయనంలాంటివి. ప్రజలను తక్కువ అంచనా వేసి నాలుగు సంక్షేమ పథకాల పేరిట పదో, పరకో ఇస్తే చచ్చినట్లు ఓట్లేస్తారని అహంకారపూరితంగా ఏ నాయకుడైన విర్రవీగితే ప్రజలు ఎంతటి నిర్ణయం తీసుకుంటారో అనేదానికి ఏపీనే నిదర్శనం.
ఈసారి 175 సీట్లు గెలుస్తామని ప్రగాల్భాలు పలికిన జగన్ అండ్ కోకు ఏపీ జనాలు చుక్కలు చూపించారు. 2019లోనే 151 సీట్లు ఇస్తే మీరు మాకు పెట్టిన పంగనామాలు ఇక చాలు..2024లో మీకు మేం పంగనామాలు పెడ్తామని ఓటర్లు ఫిక్స్ అయి..151 మధ్యలోని 5 సంఖ్యను తీసివేసి చివరకు పంగనామాలే(11) మిగిలేలా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జగన్ గుండుగీసి ఉన్న ఫొటోకు 11 సంఖ్యతో పంగనామాలను తలపించేలా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన జనాలు తెగ నవ్వుకుంటున్నారు. భలేగా ఉన్నాయే మీ పంగనామాలు..మీకు అందుకే ఏపీ జనాలు ఇచ్చారు 11 సీట్లు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్టుగా జగన్ ఓటమికి అంతకుమించే ఉన్నాయంటున్నారు టీడీపీ, జనసేన శ్రేణులు. జగన్ అరాచక పాలన, మంత్రులు, ఎమ్మెల్యేల గుండాయిజం, ఇసుక దోపిడీ, భూకబ్జాలు..ఇలా ఒక్కటేమిటి అన్నీ ప్రజలను నిలువు దోపిడీ చేసినవే. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయకుండా మూడు రాజధానులంటూ జనాల్లో అయోమయం సృష్టించడం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించకపోవడం, పోలవరం కట్టకపోవడం, ఏదో ఒకటో రెండో సంక్షేమ పథకాలు ఓట్లు రాలుస్తాయనుకుని మిగతా వాటిని పక్కన పెట్టి అందినకాడికి దోచుకోవడం.. ఇలా జగన్ పాలన ఆద్యంతం అవినీతి, కబ్జాలు,దోపిడీలే కదా అంటూ ప్రత్యర్థి పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. అరాచక పాలకుడికి ప్రజలు తగిన శాస్తి చేశారని కామెంట్ చేస్తున్నారు.