
Jakkanna : ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు టాలీవుడ్ కే కాదు.. ఇండియాకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ నుంచి బహూషా హాలీవుడ్ కు కూడా పరిచయం అవసరం లేదనుకుంటా. ఆ మూవీకి ఆస్కార్ రావడంతో టాలీవుడ్ కు మొదటి సారి ఆస్కార్ తెచ్చిన దర్శకుడిగా చరిత్రలో నిలిచాడు. బాహుబలి సమయంలో స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి వరల్డ్ గ్రేట్ డైరెక్టర్స్ రాజమౌళి గురించి గొప్పగా చెప్పారంటే మాములు విషయం కాదు. అలాంటి జక్కన్న ఒక విషయంలో జనాలను మోసం చేశాడు. మోసం అంటే అదేదో విమర్శించుకోవాల్సినంత అవసరం లేదు. అది ఎలా అనుకుంటున్నారా. తెలుసుకుందాం.
సునీల్ హీరోగా నటించిన ‘మర్యాద రామన్న’ సినిమా గుర్తుండే ఉంటుంది కదా? ఈ మూవీ ఒక హాలీవుడ్ సినిమాకు రీమేక్. అది కూడా వంద సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ మూవీ పేరే ‘అవర్ హాస్పిటాలిటీ’. ఈ మూవీ నుంచే ‘మర్యాద రామన్న’ స్క్రిప్ట్ తయారు చేసుకున్నారట. హీరో ఫాదర్ జనరేషనకు ఊరిలో గొడవలు. ఊరికి దూరంగా హీరో, తనకు తను పుట్టిన ఊరిలో ఆస్తులున్నాయని తిరిగి వెళ్లడం, ట్రైన్ లో హీరోయిన్ పరిచయం, తెలియకుండా శత్రువు ఇంటికి వెళ్లడం. ఇంటినే పవిత్రంగా భావించే విలన్ ఇంటి నుంచి కాలు బయట పెడితే హత్య చేయాలనే ప్లాన్, హీరో బయటకు వెళ్లకపోవడం.
ఈ స్టోరీ సేమ్ ‘హాస్పిటాలిటీ’ లాగే ఉంటుంది కానీ తెలుగు ఆడియన్స్ కు తగ్గట్లు కథను సిద్ధం చేసుకున్నాడట. నిజానికి హాస్పిటాలిటీ రైట్స్ కొనాలని జక్కన్న అనుకున్నాడట. కానీ ఈ సినిమా తీసిన వాళ్లు ఇప్పుడు ఎవరూ బతికి ఉండకపోవడంతో సాధ్యం కాలేదట. ‘మర్యాద రామన్న’ను ‘అవర్ హాస్పిటాలిటీ’ని బేస్ చేసుకున్నట్లు క్రెడిట్స్ మాత్రం ఇచ్చాడు. కేవలం రూ.12 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఫైనల్ రన్ లో రూ.40 కోట్లు దక్కించుకొని డిస్ట్రిబ్యూటర్లకు కలెక్షన్ల పంట పండించింది.