Japan Baba Vanga : జపాన్కు చెందిన మాజీ మంగా కళాకారిణి రియో టాట్సుకి “జపాన్ బాబా వంగ”గా ప్రసిద్ధి చెందింది. 1999లో ఆమె ప్రచురించిన “ది ఫ్యూచర్ ఐ సా” అనే మాంగా పుస్తకంలో చేసిన భవిష్యవాణులు చాలావరకు నిజమయ్యాయి.
1995 కోబె భూకంపం, 2011 తోహోకు సునామీ, 2020 కోవిడ్-19 మహమ్మారిని ఆమె ముందే ఊహించింది. ఆమె డైరీలో 1992లో “డయానా.. డైడ్?” అని రాసింది, అది 1997లో ప్రిన్సెస్ డయానా మరణాన్ని సూచించింది.
తాజాగా రియో 2025 జులైలో జపాన్తో పాటు ఫిలిప్పీన్స్, తైవాన్, ఇండోనేషియాలను ముంచెత్తే భారీ సునామీ రాబోతుందని హెచ్చరించింది. ఇది 2011 కంటే మూడు రెట్లు భయంకరంగా ఉంటుందని పేర్కొంది. సముద్రం “మరిగే” దృశ్యాన్ని తన కలలో చూసినట్లు చెప్పింది.
అలాగే 2020లో వచ్చిన వైరస్ 2030లో తిరిగి రావచ్చని ఆమె హెచ్చరించింది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఆమె ఊహలకు ఆధారాలు లేవన్నారు. కానీ జపాన్ భౌగోళికంగా ప్రమాదకర ప్రాంతంలో ఉందని అంగీకరిస్తున్నారు. దీంతో ‘వంగా’ భవిష్యవాణులు నమ్మకాన్ని, అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.