33.1 C
India
Tuesday, February 11, 2025
More

    Jaydev Galla : జయదేవ్ గల్లా గుంటూరు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.. తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ

    Date:

    Jaydev Galla
    Jaydev Galla
    Jaydev Galla : గుంటూరు జిల్లా ప్రజల  గుండెల్లో జయదేవ్ గల్లా చిరస్థాయిగా నిలిచిపోతారని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ  కొనియాడారు. గడిచిన పదేండ్లుగా తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీగా  ప్రత్యేక హోదా, పోలవరం, రాష్ట్ర హక్కుల కోసం పోరాడిన జయదేవ్ గల్లా నేటి యువతకు ఎంతో స్ఫూర్తి దాయకంగా నిలిచారు.  జయదేవ్ గల్లా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆయనకు ‘‘కృతజ్ఞతాభివందనం’’పేరుతో గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.

    తెలుగుయువత జిల్లా  అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జయదేవ్ గల్లా పార్లమెంట్ లో  ప్రత్యేక హోదా విభజన హామీల కోసం గళం విప్పిన చిత్రాలు, అమరావతి రాజధాని కోసం రైతుల పోరాటంలో ఎదుర్కొన్న విచారక సంఘటనలను గుంటూరు పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను  భారీ సైకత శిల్పం రూపంలో  పొందుపరిచారు. ఈ భారీ సైకత శిల్పాన్ని అంతర్జాతీయ సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ చే ప్రత్యేకంగా రూపొందించి ప్రదర్శనలో ఉంచడం విశేషం.

    గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లాతో  పాటు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్,
    టీడీపీ అర్బన్  అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టీడీపీ గుంటూరు పశ్చిమ ఇన్ చార్జి కోవెలమూడి రవీంద్రతో పాటు టీడీపీ నేతలు, అమరావతి రైతులు, వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా  తెలుగుయువత జిల్లా  అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ.. ఇన్నాళ్లు ఎంపీగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి అద్వితీయమైన సేవలు అందజేశారన్నారు. తనలాంటి  శ్రమజీవులను గుర్తించి పార్టీ అధినాయకత్వం సహకారంతో ఎంతో మందికి వివిధ అవకాశాలు కల్పించారన్నారు. జయదేవ్ లాంటి నిస్వార్థ సేవకుడి రాజకీయ నిష్క్రమణ బాధాకరమన్నారు. ఆగర్భ శ్రీమంతుడైన జయదేవ్ కు  ఏమిచ్చి రుణం తీర్చుకోలేమన్నారు. చిరకాలం ప్రజల్లో గుండెల్లో గూడు కట్టుకుంటారన్నారు.

    కల్మషం లేని ‘గుంటూరు గుండె శబ్దం గల్లా’కు  గుర్తుగా తెలుగుయువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అంతర్జాతీయ సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ చేత  చిరకాలం గుర్తుండిపోయే విధంగా సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నామన్నారు. తిరిగి జయదేవ్ గల్లా అతిత్వరలో ప్రజాసేవలో పూర్తి స్థాయిలో సేవలందించేలా ముందుకు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో తెలుగుయువత నేతలు, కార్యకర్తలు, గల్లా అభిమానులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Largest Traffic Jam : ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్.. 300 కిమీ మేర నిలిచిన వాహనాలు

    Largest Traffic Jam : ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్రతువు మహాకుంభమేళా మరో...

    Pawan Kalyan : పవన్ సనాతన ధర్మ టూర్ 12వ తేదీ నుంచి !

    Pawan Kalyan : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ...

    Health Minister Serious : రెండు రోజుల పాటు శవానికి ట్రీట్మెంట్ ..హెల్త్ మినిస్టర్ సీరియస్

    Health Minister Serious : హైదరాబాద్ మియాపూర్ సిద్ధార్థ హస్పటల్ ఘటనపై హెల్త్...

    Alla Nani : టిడిపి లోకి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని?

    Alla Nani Join into TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP Coalition: కూట‌మి పాల‌న‌పై పాజిటివ్ చ‌ర్చ లేదేం!

    TDP Coalition: టీడీపీ స‌ర్కార్ కొలువుదీరి ఐదు నెల‌లు కావస్తుంది. ఇప్పటికే...

    Nominated Posts: పోరాట యోధులకు పట్టం కట్టిన టీడీపీ..

    Nominated Posts:2019 నుంచి ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం పాలించింది. ఈ ఐదేళ్లు...

    MLA Satyaprabha : అన్నవరం ఆలయంలో ఎమ్మెల్యే తనిఖీలు: బన్సీ రవ్వలో పురుగులు

    MLA Satyaprabha: కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల...

    Chandrababu : చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి మరణశాసనం.. ఆ అక్రమ అరెస్టుకు ఏడాది!

    Chandrababu : చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయని, అందులో చంద్రబాబు ప్రమేయం ఉందన్న ఆరోపణలతో పోలీసులు ఆయననను అరెస్టు చేశారు.