
JEE Main : జేఈఈ (మెయిన్) 2025 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి మొత్తం 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అద్భుతంగా రాణించారు. హైదరాబాద్కు చెందిన బనిబ్రత మాజీ, వంగల అజయ్రెడ్డి 300కి 300 మార్కులతో జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. అజయ్రెడ్డి ఈడబ్ల్యూఎస్ విభాగంలోనూ మొదటి ర్యాంకు దక్కించుకున్నారు. ఈసారి జనరల్ విభాగానికి కటాఫ్ 93.102 పర్సంటైల్గా నిర్ణయించారు. కటాఫ్కు పైగా స్కోర్ వచ్చినవారే మే 18న జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులు.