30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Jio Revolution : జియో మరో విప్లవం.. రూ. 599 కే అన్ లిమిటెడ్ ఇంటర్నెట్

    Date:

    Jio Revolution
    Jio Revolution

    Jio Revolution : సమాచార రంగంలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జియో సాంకేతికతతో ముందుకు వెళ్తోంది. జియో ఎయిర్ ఫైబర్ సేవలు అందిస్తోంది. హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్ కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. జియో తీసుకొస్తున్న మార్పులతో వినియోగదారులకు ప్రయోజనాలు దక్కుతున్నాయి.

    జియో ఎయిర్ ఫైబర్ డివైజ్ ను ఆన్ చేయగానే ప్రత్యేక 5జీ రేడియో లింక్ ద్వారా దగ్గరలోని టవర్ నుంచి సిగ్నల్స్ అందుతాయి. దీంతో నెట్ వేగవంతంగా అందుబాటులోకి వస్తుంది. రూ.599 నుంచే దీని ధర ప్రారంభం అవుతుంది. అన్ లిమిటెడ్ డేటా మన సొంతం అవుతుంది. గతంలో కూడా జియో తీసుకొచ్చిన అధునాతన ఆఫర్లతో దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే.

    ఎలాంటి కేబుల్స్, వైర్లు అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. దీంతో జియో తీసుకొచ్చిన ఆఫర్ కు అందరు మొగ్గు చూపే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అన్ లిమిటెడ్ డేటా ఏ కంపెనీ కూడా ఇవ్వడం లేదు. ఈమేరకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటన చేయడంతో వినియోగదారుల్లో ఉత్సాహం నెలకొంది. రూ.599 తో అన్ని రకాల సేవలు పొందవచ్చని తెలుస్తోంది.

    సమాచార రంగంలో పలు మార్పులు తీసుకురావడం రిలయన్స్ కు కొత్తేమీ కాదు. ఏ స్కీమ్ తీసుకొచ్చినా దానికి తొందరగా వినియోగదారులను ఆకర్షించడంలో ముందుంటారు. ఇందులో భాగంగానే ఎయిర్ ఫైబర్ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పథకం తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి మరో విప్లవం తీసుకొచ్చేందుకు రిలయన్స్ ప్లాన్ చేసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BSNL Employees : బీఎస్‌ఎన్‌ఎల్‌ను బతికించండి.. కేంద్ర మంత్రికి సంస్థ ఉద్యోగుల వినతి

    BSNL Employees : ప్రైవేటు టెలికం సంస్థలు హైస్పీడ్‌ 5జీ సేవలిస్తుంటే, బీఎస్‌ఎన్‌ఎల్‌...

    Jio Broadband services : ఇక దేశవ్యాప్తంగా జియో బ్రాడ్ బాండ్ సేవలు

    Jio Broadband services : టెలికాం రంగంలో రిలయన్స్ వినూత్న మార్పులు...