
JR. NTR : నాగ చైతన్య-సమంతల విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించారు. ఇతరులు తమ పై నిరాధార ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేనని అన్నారు. సినీ పరిశ్రమపై చేసిన నిర్లక్ష్య, నిరాధారమైన వాదనలు బాధించాయని తారక్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘ కొండా సురేఖ గారు, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం సరికాదు.. పబ్లిక్ ఫిగర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మీలాంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు గౌరవాన్ని, గోప్యతను కాపాడుకోవాలి.. ముఖ్యంగా సినీ పరిశ్రమపై నిర్లక్ష్యంగా, నిరాధారమైన ప్రకటనలు చేయడం చాలా బాధాకరం.
ఇతరులు మనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే మనం మౌనంగా కూర్చోము. ఇలాంటి వాటిని సినీ పరిశ్రమ సహించదు. మేము ఒకరినొకరు గౌరవించుకోవడానికి.. గీత దాటకుండా ఉండటానికి ఈ సమస్యను ఖచ్చితంగా లేవనెత్తుతాము. ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు’’ అని తారక్ ట్వీట్ చేశారు. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీని వదిలేయడానికి కారణం కేటీఆర్ అని కూడా ఆమె ఆరోపించింది. కేటీఆర్ కు డ్రగ్స్ అలవాటు ఉందని, హీరోయిన్లు కూడా డ్రగ్స్ కు అలవాటు చేశారని ఆరోపించారు. వారితో కలిసి రేవ్ పార్టీలు చేసుకుని, మదమెక్కి.. వారి జీవితాలతో ఆడుకున్నారని, ఆపై బ్లాక్ మెయిల్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయం సినీ పరిశ్రమలో అందరికీ తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. దీంతో సురేఖ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.
Konda Surekha garu, dragging personal lives into politics is a new low. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It’s disheartening to see baseless statements thrown around carelessly, especially about the…
— Jr NTR (@tarak9999) October 2, 2024