16.3 C
India
Sunday, December 7, 2025
More

    JR NTR : జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్.. ఏపీలో పార్టీల శవ రాజకీయం!

    Date:

    Junior NTR fan
    Junior NTR fan

    JR NTR : ఏపీలో శ్యామ్ అనే యువకుడి ఆత్మహత్య పెద్ద సంచలనం అవుతున్నది. వైసీపీ నేతల కారణంగానే శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నట్లు టీడీపీ శ్రేణులు ఆరోపణలకు దిగాయి. ఏకంగా శ్యామ్ ను వారే చంపేశారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాయి. అయితే శ్యామ్ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో అతడి ఆత్మహత్య ఈ సమయంలో మరింత సంచలనమైంది.

    శ్యామ్ తన ఆత్మహత్యకు ముందే కారణాలను చెబుతూ ఒక వీడియో విడుదల చేశాడు. ఇదంతా ఎవరూ పట్టించుకోలేదు. అయితే శ్యామ్ మరణం వెనుక కారణాలు కొంత అనుమానాస్పదంగానే కనిపించాయి. దీంతో టీడీపీ రంగ ప్రవేశం చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్యామ్ మరణం పై రాజకీయాలకు అంటగడుతూ వైసీసీ కార్యకర్తలు హత్య చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతని మిత్రులు కూడా శ్యామ్ మరణం వెనుక ఇతర కారణాలు ఉన్నాయని, ఇది ఆత్మహత్య కాదని అనుమానం వ్యక్తం చేశారు. శ్యామ్ విడుదల చేసిన వీడియోలో తన మరణానికి ప్రేమ వ్యవహారం కారణమని, వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయని చెప్పాడు.

    ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్యామ్ మరణాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించారు. వైసీపీ కార్యకర్తలు హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పాటు టీడీపీ యువనేత లోకేశ్ కూడా ట్వీట్ చేశారు. శ్యాం కుటుంబానికి న్యాయం జరిగే వరకూ టీడీపీ పోరాడుతుందని పేర్కొన్నారు. ఇక అగ్ర నేతలు  శ్యామ్ మరణం పై వైసీపీని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు కూడా అదే స్పీడ్ తో వైసిపి పై దుమ్మెత్తి పోస్తూ ప్రచారం మొదలుపెట్టారు.

    శ్యామ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. ఇందులోకి జూనియర్ ఎన్టీఆర్ ను కూడా లాగాలని టీడీపీ ప్రయత్నించింది ‌ ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. శ్యామ్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూనే ఎందుకు చనిపోయాడో తెలియక పోవడం కలిచి వేస్తున్నదని పేర్కొన్నారు అధికారులు ఈ విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని కోరారు. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కూడా టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు.

    తెలుగుదేశానికి కాస్త దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ అండ్ అభిమానులను తన వైపు తిప్పుకునేలా ఆయన ప్రయత్నాలు చేశారు. మరికొందరు మాత్రం టీడీపీ తీరుపై మండిపడ్డారు. శివ రాజకీయాలు చేసేందుకే టీడీపీ ప్రయత్నిస్తున్నదని చివరకు చంద్రబాబు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయడం నీచమని పేర్కొన్నారు. తనకు తానే వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో పేర్కొన్నా వైసీపీ నేతలు హత్య చేశారంటూ చంద్రబాబు ఫీడ్ చేయడం సంచలనమైంది. ఏదేమైనా రెండు పార్టీలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి రాజకీయాలకు దిగడం ఏపీ ప్రజలకు ఇబ్బందిగా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jogi Ramesh : జోగి రమేష్‌పై ఉచ్చు బిగుస్తోందా?

    Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయ దూకుడే ఇప్పుడు...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్ ఖేల్ ఖతమైనట్టేనా?

    Sajjala Bhargav : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి...

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...