Project K Villan : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కే’. నాగ్ అశ్విన్ దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి కంటెంట్ తో సినిమా రాలేదని, ఇది చూసిన ప్రేక్షకులు తప్పక ఫీల్ అవుతారని మేకర్స్ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకచ్చారు. అయితే నాగ్ అశ్విన్ పై మేకర్స్ తో పాటు ఆడియన్స్ కూడా బాగా విశ్వాసం ఉంది.
ఈ ఏడాది లోనే ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్ పూర్తి చేసుకోబోతుదని వార్తలు వినిపించాయి. 2024 సంక్రాంతి వరకు ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన దీపికా పడుకోన్ నటిస్తుండగా, బిగ్ బీ అమితాబ్ కూడా ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఇప్పుడు చెక్కర్లు కొడుతోంది. ‘ప్రాజెక్ట్ కే’లో విశ్వ నటుడు కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతున్నారట. ఇందుకు ఆయన రూ. 150 కోట్ల వరకూ ని తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయాన్నీ ప్రకటించింది. ఇందులో నిజం ఎంతో, అబద్ధం ఎంతో తెలియాల్సి ఉంది. అయితే కమల్ హాసన్ ‘విక్రమ్’ సెన్సేషనల్ హిట్ సాధించడంతో ఆయన హీరోగా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.
కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ తర్వాత ఆయన తమిళ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘ఇండియాన్ 2’ కోసం పని చేస్తున్నాడు. ఆయన కెరీర్ ఇంత పీక్ లో వెళ్తున్న సమయంలో నెగెటివ్ రోల్స్ లో చేస్తాడా అన్న అనుమానం వ్యక్తం అవుతున్నా.. విశ్వనటుడికి ఈ రోల్ ఒక లెక్కే కాదు.. ఇది ఆయనకు ఎటువంటి మచ్చ తీసుకురాదని కొందరు చెప్తున్నారు.