Rahul Gandhi : కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. పది రోజుల పర్యటన నిమిత్తం అయన అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ పలువురు ప్రతినిధులు, విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, నేతలతో సమావేశం అవుతున్నారు. స్థానిక ఇండియా వాసులను కలుసుకుంటున్నారు. పలు సెమినార్లలో ప్రసంగిస్తున్నారు.
అయితే రాహుల్ గురువారం చేసిన వ్యాఖ్యలు కమలనాథుల్లో తీవ్ర కలకలం రేపాయి. భారతదేశంలో ముస్లింలకు రక్షణ లేదని రాహుల్ వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. అయితే రాహుల్ ఏం మాట్లాడినా విమర్శించడానికి బిజెపిలో ఒక టీం ఉంటుంది. ప్రస్తుతం ఈ టీం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై విరుచుకపడుతున్నది
రాహుల్ గాంధీ విదేశాల్లో మన దేశం పరువు తీసేస్తున్నారని మండిపడుతున్నారు. దేశం పేరు ప్రతిష్టలను నిలబెట్టడానికి ఒకవైపు మోడీ కష్టపడుతున్నారని, అయితే రాహుల్ మాత్రం అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు. దేశాన్ని కించపరిచేలా విదేశీ గడ్డపై మాట్లాడడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బిజెపి నేతలు భుజాలు తడుముకోవడం ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ ను విమర్శించడం అటు ఉంచితే మోడీ భజన చేయడానికే బిజెపి నేతలు సరిపోతున్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యమే లేకపోతే కనుక రాహుల్ ఈ రోజు విదేశీ గడ్డపై మాట్లాడే వారేనా అని బీజేపీ సీనియర్ నేత ఒకరు విమర్శిస్తున్నారు అయితే రాహుల్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి అయినా బీజేపీ నేతలు మాత్రం తాము ముస్లింలకు రక్షణ కల్పిస్తున్నామని గట్టిగా చెప్పలేకపోతున్నారు. తమది లౌకిక రాజ్యమని అనలేకపోతున్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యల్లో తప్పేముందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ ఏది మాట్లాడినా విమర్శలు చేయడం, భుజాలు తడుముకోవడం బీజేపీ నేతలకు అలవాటైందని విమర్శిస్తున్నారు.