
KCR : తెలంగాణ విద్యుత్ కమిషన్పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని వివరరించారు. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. అలాగే ఎనర్జీ విభాగాన్ని ప్రతివాదిగా చేర్చారు.
కాగా, తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకోకు పిలుపునిచ్చారంటూ పోలీసులు తనపై నమోదు చేసిన కేసున రద్దు చేయాలంటూ సోమవారం (జూన్ 14) హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించగా, ఆ పిటిషన్ పై న్యాయస్థనం స్టే విధించింది. తాజాగా ఈరోజు (జూన్ 25) బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై వస్తున్ ఆరోపణలపై రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసి విచారణ జరిపిస్తుండగా, ఆ కమిషన్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో కేసీఆర్ రిటి పిటిషన్ వేశారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ ను విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించిన కేసీఆర్, కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అంతేకాకుండా, జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగాలంటూ కేసీఆర్ కోరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.