
KCR says BJP : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెసమీట్ ల్లో, బహిరంగ సభల్లో ప్రత్యర్థులపై తనదైశన శైలిలో విరుచుకుపడుతుంటారు. రాష్ర్ట రాజకీయాల్లో వేలు పెట్టే ఏ ఒక్కరినీ ఆయన వదలరు. తన మాటలతో క్యాడర్ లో జోష్ నింపుతూనే, అవతలి వారిని తన మాటలతో చీల్చి చెండాడుతారు. అయితే కొంతకాలంగా ఆయన జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరిట టీఆర్ఎస్ ను రూపాంతరం చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయం తామే అంటూ చెప్పుకొచ్చారు.
తాజాగా ఆదివారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ భవన్ ఓపెనింగ్ లో భాగంగా సీఎం కేసీఆర్ అక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దేశమంతా తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నదని చెప్పారు. తొమ్మిదేళ్లలో జరిగిన ప్రగతి, సాధించిన విజయాలు, సాధించుకున్న అభివృద్ధిని గుర్తు చేశారు. ఇక్కడి పథకాలను మహారాష్ర్ట ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అయితే ఆయన చివరలో ఒక్క కాంగ్రెస్ పైనే విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టారు. ధరణిని బంగాళఖాతంలో కలిపేద్దామని అంటున్న కాంగ్రెస్ నే బంగాళఖాతంలో కలిపేద్దామని పిలుపునిచ్చారు. అయితే సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఎక్కడా బీజేపీ, మోదీ పేరెత్తలేదు. సాధారణంగా ఆయన ప్రసంగమంటే వాడీవేడిగా ఉంటుంది. ఇది ఆయన అనుచరుల్లో ఎక్కడా లేనంతగా జోష్ నింపుతుంది. అయితే ఈ సారి ఆయన ప్రసంగా సప్పగా ఉందని అంతా చర్చించుకుంటున్నారు.
అయితే బీజేపీ, మోదీ పై సీఎం కేసీఆర్ వైఖరి మారిందని అంతా అనుకుంటున్నారు. కేంద్రం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూతురు కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. అయితే ఈ సమయంలో కయ్యానికి కాలు దువ్వడం మంచిది కాదనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ఆయన టీంలోని కొందరు ఇప్పటికే బీజేపీ కేంద్ర పెద్దలతో టచ్ లో ఉన్నారని కవిత అంశం ఇక మరుగునపడేసే ప్రయత్నం చేశారని టాక్. అయితే కేంద్రం సహకరిస్తున్నందన విమర్శించకపోవడమే బెటర్ అనే ఆలోచనలో ఆయన ఉన్నారట.






