
Singapore Beach : సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం నెలకొంది. కోదాడ పట్టణానికి చెందిన పవన్ ఏడాదిన్నర క్రితం సింగపూర్ వెళ్లాడు. అక్కడ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో జులై 5న సరదాగా గడిపేందుకు బీచ్ కు వెళ్లాడని, అక్కడ అలల ఉధృతికి నీఠిలో కొట్టుకుపోయి మృతి చెందాడని పవన్ స్నేహితులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కోదాడలోని పవన్ తల్లిదండ్రులకు తెలియజేశారు.
మృతుడు పవన్ తండ్రి శ్రీనివాసరాదు కోదాడలో పల్లినూనె వ్యాపారం చేస్తున్నాడు. సోదరుడు లండన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. పవన్ కూడా రెండు నెలల్లో ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ పవన్ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పవన్ మృతదేహాన్ని తొందరగా ఇంటికి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.