
KTR : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చినా వైఎస్ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. అయినా వైసీపీ 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదన్నారు. మంగళవారం(జులై 9) ఢిల్లీలో కేటీఆర్ మీడియా చిట్చాట్లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉంటున్నారు. మీడియాతో చిట్ చాట్ సమయంలో ఏపీలో జగన్ ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ 40శాతం ఓట్లు సాధించటం మాములు విషయం కాదన్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు ఇంకోలా ఉండేవని… ప్రతి క్షణం ప్రజల్లో ఉండే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవటం ఏమిటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు జగన్ ఓడించాలన్న వ్యూహాంలో వైఎస్ షర్మిలను ఓ పావుగా వాడుకున్నారని ఆమె వల్ల ఏమీ కాదంటూ వైసీపీ నాయకుడి తరహాలో కేటీఆర్ కామెంట్ చేశారు.
ఇటు తెలంగాణలో ఓటమిపై కామెంట్ చేస్తూ ప్రజలది తప్పు అనటం మాదే తప్పని, ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిన మాట నిజమేనని ఫలితాల తర్వాత తమకు అర్థమైందన్నారు. ఇక తెలంగాణలో ఓటమి, ఫిరాయింపులపై హరీష్ రావు స్పందిస్తూ గతంలో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు ఓడిపోయారని, ఇప్పుడు కాంగ్రెస్ కు అదే వర్తిస్తుందని, ఫిరాయింపు ఎమ్మెల్యేల వల్ల పార్టీలకు నష్టమే తప్ప లాభం ఉండదన్నారు.